మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి 75వ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు బ్యాక్ టు బ్యాక్ సర్ప్రైజ్లు అందుతున్నాయి. ఇప్పటికే ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘మేళా’ మూవీ ఫస్ట్ లుక్ విడుదల కాగా.. ధనుష్, ముమ్ముట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న మూవీ ‘ఓమ్’ నుంచి కూడా స్పెషల్ అప్డేట్ బయటికొచ్చింది. దీంతో మమ్ముట్టి అభిమానులు సోషల్ మీడియాలో సంబరాలు చేసుకుంటున్నారు. మరోపక్క ప్రముఖులతో పాటు అభిమానులు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఇదీ చదవండి: ‘హనుమాన్ అంశ్’ కి తగ్గని క్రేజ్.. పంచెకట్టుతో విద్యార్థులు
సినిమా విషయానికి వస్తే..
మమ్ముట్టి, దర్శకుడు నితీష్ సహదేవ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘మేళా’. మమ్ముట్టి సొంత నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ బ్యానర్లో వస్తున్న తొమ్మిదో చిత్రమిది. ఈ చిత్రానికి అనురాజ్ ఓ.బి., నితీష్ సహదేవ్ కలిసి కథ, స్క్రీన్ప్లే అందిస్తున్నారు. నితీశ్ సహదేవ్ గతంలో ‘ఫ్యామిలీ’ చిత్రానికి దర్శకత్వం వహించారు. జిమ్షీ ఖలీద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ జులైలోనే ప్రారంభమైనట్లు సమాచారం.
ఓమ్: ధనుష్, ముమ్ముట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియసామి తెరకెక్కిస్తున్నారు. సాయి పల్లవి, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. వండర్ బార్ ఫిలిమ్స్, ఆర్టేక్ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు.
తెలుగులో..
మలయాళ నటుడు మమ్ముట్టి నటించిన పలు సినిమాలు తెలుగులో విడుదలై మంచి ప్రేక్షకాదరణ పొందాయి. అయితే 2019లో విడుదలైన యాత్ర సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ముమ్ముట్టి. మంచి విజయం సాధించడంతో దీనికి సీక్వెల్ గా యాత్ర2ను 2024 ఫిబ్రవరి 8న విడుదల చేశారు. ఈ సినిమాలోనూ ప్రత్యేక పాత్రలో ముమ్ముట్టి కనిపించారు. ( స్నేహితులుగా ఎంట్రీ.. బిగ్బాస్లో ప్రత్యర్థులవుతారా..?)


