-
నితీశ్ ట్రిపుల్ సెంచరీ
సాక్షి, హైదరాబాద్: తమిళనాడు జట్టుతో జరుగుతున్న విజయ్ మర్చంట్ ట్రోఫీ అండర్–16 క్రికెట్ టోర్నీలో ఆంధ్ర బ్యాట్స్మన్ కె. నితీశ్ కుమార్ రెడ్డి (407 బంతుల్లో 301 నాటౌట్; 41 ఫోర్లు, ఒక సిక్స్) అజేయ ట్రిపుల్ సెంచరీతో దుమ్మురేపాడు. ఎన్ఎఫ్సీ గ్రౌండ్లో జరుగుతున్న ఈ మ్యాచ్లో ధరణి కుమార్ (101; 14 ఫోర్లు, 1 సిక్స్) కూడా సెంచరీ చేయడంతో ఆంధ్ర భారీస్కోరు సాధించింది. ఓవర్నైట్ స్కోరు 320/3తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ను కొనసాగించిన ఆంధ్ర 127 ఓవర్లలో 4 వికెట్లకు 509 పరుగుల వద్ద ఇన్నిం గ్స్ను డిక్లేర్ చేసింది. 190 పరుగుల వ్యక్తిగత స్కోరుతో ఆట ప్రారంభించిన నితీశ్... 318 బంతుల్లో డబుల్ సెంచరీని, 406 బంతుల్లో ట్రిపుల్ సెంచరీని అందుకున్నాడు. ధరణి, నితీశ్ జోడి నాలుగో వికెట్కు 229 పరుగుల్ని జోడించింది. తమిళనాడు బౌలర్లు రోజంతా శ్రమించి కేవలం ఒక వికెట్ మాత్రమే పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించిన తమిళనాడు ఆటముగిసే సమయానికి 2 వికెట్లకు 126 పరుగులు చేసింది. -
స్పీడ్ కిల్స్!
► సిటీలో వాహనాల సరాసరి వేగం: గంటకు 18 కి.మీ ► నిశిత్ నారాయణ నడుపుతున్న కారు స్పీడు: గంటకు 205 కి.మీ... ► మెర్సిడెస్ బెంజ్ జీ 63 ఏఎంజీ మోడల్ వాహనం గరిష్ట వేగం: గంటకు 230 కి.మీ ► అతివేగం..ర్యాష్ డ్రైవింగ్లతోనే ప్రమాదాలు ► నగరంలో ఏటా వేల కేసులు నమోదు ► నగర రోడ్లకు–వాహనాలకు పొంతనే లేదు ► అడ్డుకోవడానికి అవసరమైన నిబంధనలు కరవు సిటీబ్యూరో: వాహనాన్ని అతివేగంగా నడపడం వల్లే ఏపీ మంత్రి నారాయణ తనయుడు నిశిత్ నారాయణ బుధవారం తెల్ల వారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందినట్లు తేలింది. ఈనేపథ్యంలో నగరంలో వాహనాల వేగంపై మరోసారి చర్చ తలెత్తింది. కేవలం ఈ సమయాల్లో, ఈ మార్గాల్లోనే కాదు... సిటీలో ఎక్కడ చూసినా ఓవర్ స్పీడింగ్, డేంజరస్ డ్రైవింగ్, ర్యాష్డ్రైవింగ్స్ కనిపిస్తాయి. ఈ ఉల్లంఘనలకు పాల్పడే వారు సైతం 20–30 ఏళ్ల మధ్య వయస్కులే ఎక్కువగా ఉంటున్నారు. అదో ప్యాషన్గా మారిపోయి... స్పీడ్ థ్రిల్స్... బట్ కిల్స్ అనే నానుడిని పోలీసు, ఆర్టీఏ విభాగాలు నిత్యం ప్రచారం చేస్తూనే ఉంటాయి. అయినప్పటికీ హైఎండ్ వాహనాల్లో/వాహనాలపై, వీలున్నంత వేగంగా దూసుకుపోవడం కొందరు వాహనచోదకులకు నిత్యకృత్యమైంది. అధికారులు రహదారి నిబంధనల ఉల్లంఘనల్ని మూడు కేటగిరీలుగా విభజిస్తారు. వాహనచోదకుడికి ప్రమాదం కలిగించేవి, ఎదుటి వారికి ప్రమాదాన్ని చేకూర్చేవి, వాహనచోదకుడితో పాటు ఎదుటి వారికీ ప్రమాదకరమైనవి. ఓవర్ స్పీడింగ్, డేంజరస్ డ్రైవింగ్, ర్యాష్డ్రైవింగ్ ఉల్లంఘనలు మూడో కోవకు చెందుతాయి. వాహనం ఏమాత్రం అదుపు తప్పినా వాహనచోదకుడినే కాదు అనేక సందర్భాల్లో ఏ పాపం ఎరుగని ఎదుటి వారినీ మింగేస్తాయి. అయినప్పటికీ రద్దీ రోడ్లలోనూ విచ్చలవిడి స్పీడుతో, విన్యాసాలతో దూసుకుపోయే యువత ఎందరో ఉంటున్నారు. రాత్రి వేళల్లో, విశాలంగా... ఖాళీగా కనిపిస్తున్న రోడ్లపై వీరి విషయం ఇక చెప్పక్కర్లేదు. ఆ రెంటికీ పొంతనే ఉండదు... నగరంలోని రోడ్ల స్థితిగతులు, వాహనాల గరిష్ట వేగం తదితర అంశాలపైనే ఇక్కడ పరిగెత్తే వాహనాలు ఆధారపడి ఉంటాయి. అయితే సిటీలో సరాసరి వేగం గరిష్టంగా గంటకు 18 కి.మీగా ఉంటే...ఇక్కడ అందుబాటులో ఉంటున్న, దిగుమతి చేసుకుంటున్న వాహనాల గరిష్టం వేగం గంటలకు 200 కిమీ కంటే ఎక్కువే ఉంటోంది. ఇదే అనేక సందర్భాల్లో ప్రమాదాలకు హేతువుగా మారింది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని నగరంలో మితిమీరిన వేగంతో వెళ్ళే వాహనాల రిజిస్ట్రేషన్ను నిరోధించే చట్టాలు, నిబంధనలు అంటూ మచ్చుకైనా కనిపించవు. సిటీలో వాహనాల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ స్థాయిలో మౌలిక వసతులు, రోడ్ల విస్తరణ చేడుతున్న దాఖలాలు లేవు. ఇవన్నీ సైతం పరోక్షంగా రోడ్డు ప్రమాదాలకు కారణంగా మారుతున్నాయి. ‘బెల్ట్’ అంటే నిర్లక్ష్యం... ద్విచక్ర వాహనచోదకుడికి హెల్మెట్ ఎలానో.. తేలికపాటి వాహనం నడిపే వారికి సీటుబెల్ట్ అలానే తప్పనిసరి. అయితే వీటిని ధరించి కార్లు నడుపుతున్న వారి సంఖ్య ఉండాల్సిన స్థాయిలో ఉండట్లేదు. నిబంధనల ప్రకారం తేలికపాటి వాహనాలను డ్రైవ్ చేసే వారు మాత్రమే కాదు.. వాటిలో ప్రయాణించే వారు సైతం సీటుబెల్టులు ధరించాల్సిందే. కానీ పాటిస్తున్న దాఖలాలు తక్కువే. బుధవారం తెల్లవారుజామున జూబ్లీహిల్స్లో జరిగిన నిశిత్ నారాయణ ప్రమాదంలో ప్రాణనష్టానికి సీటుబెల్ట్ వాడకపోవడమే కారణమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఎట్టకేలకు మేల్కొన్న పోలీసులు... సిటీ ట్రాఫిక్ పోలీసులు ఇటీవలే రేసింగ్స్, ర్యాష్డ్రైవింగ్పై ప్రత్యేక దృష్టి పెట్టారు. వీరిని కట్టడి చేయడానికి ‘ఆర్ఆర్ డ్రైవ్’ పేరుతో ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నారు. వీటిలో చిక్కిన వారికి జరిమానాతో సరిపెట్టకుండా వాహనాలు స్వాధీనం చేసుకోవడం, కౌన్సిలింగ్ వంటి చర్యలు తీసుకుంటున్నారు. -
నాచినపల్లి టూ నేపాల్
కబడ్డీలో రాణిస్తున్న గ్రామీణ విద్యార్థులు రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో ప్రతిభ నేపాల్ అంతర్జాతీయస్థాయి క్రీడలకు ఎంపిక ప్రయాణ ఖర్చులు లేక ఇబ్బందులు దాతల సాయం కోసం ఎదురుచూపులు నాచినపల్లి (దుగ్గొండి) : ఒకప్పుడు గ్రామీణ ప్రాంతానికే పరిమితమై.. కొన్నేళ్ల నుంచి అంతర్జాతీయస్థాయి గుర్తింపు పొందిన కబడ్డీలో ఇద్దరు విద్యార్థులు రాణిస్తున్నారు. పేదరికంలో పుట్టినప్పటికీ వారు మెుక్కవోని దీక్షతో, అకుంఠిత పట్టుదలతో ముందుకుసాగుతున్నారు. ఈ మేరకు రాష్ట్ర, జాతీయస్థాయిలో ప్రతిభ కనబరచడంతోపాటు తాజాగా నేపా ల్ దేశంలో జరిగే సౌత్ ఏషియన్ అంతర్జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికై సత్తాచాటారు. అనిల్ క్రీడా ప్రస్థానం మండలంలోని నాచినపల్లి గ్రామానికి చెందిన గుండెబోయిన నర్సయ్య, ప్రమీల దంపతుల కుమారుడు అనిల్ 1 నుం చి 10వ తరగతి వరకు స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివాడు. నర్సంపేట కాకతీయ జూనియర్ కళాశాలలో ఇం టర్ పూర్తి చేశాడు. 2010–11లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి కబడ్డీ పోటీల్లో, అదే ఏడాది కాకతీయ యూనివర్సిటీలో జరిగిన ఆల్ ఇండియా యూనివర్సిటీ పాల్గొని ప్రతిభ కనబరిచాడు. ప్రస్తుతం ఆయన వరంగల్ సీకేఎం కâ శాలలో డిగ్రీ చదువుతున్నాడు. ఇదిలా ఉండగా, అనిల్ ఈనెల 14 నుంచి 16 వరకు మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో జరిగిన జాతీయస్థాయి కబడ్డీ అండర్–19 విభాగంలో పాల్గొని సత్తాచాటారు. ఈ మేరకు నిర్వాహకులు ఆయనను ఆగస్టు 4 నుంచి నేపాల్ రాజధాని ఖాట్మాండులో జరిగే సౌత్ ఏషియన్ పోటీలకు ఎంపికచేశారు. సత్తాచాటుతున్న ‘నితీష్’ పేదరికం వెక్కిరిస్తున్నప్పటికీ అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు కన్నెబోయిన నితీష్ కృషి చేస్తున్నాడు. నాచినపల్లి గ్రామానికి చెందిన కన్నెబోయిన కుమారస్వామి–కవిత దంపతుల కుమారుడు నితీష్ 1 నుంచి 5 వరకు స్థానిక పాఠశాలలో, 6 నుంచి 10 వరకు నర్సంపేట మండలంలోని మహేశ్వరం శివానీ విద్యాలయంలో చదువున్నాడు. ఆరేళ్ల క్రితం భ ర్త అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడినప్పటికీ భార్య కవిత కుమారుడిని కష్టపడి చదివిస్తోంది. నర్సంపేట ప్రభు త్వ జూనియర్ కళాశాలలో ఇటీవల ఇంటర్ పూర్తి చేసిన నితీష్ కబడ్డీలో రాణిస్తున్నాడు. 2013–14లో స్కూల్ గేమ్స్ ఫెడ రేషన్ నిర్వహించిన జిల్లాస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచాడు. 2014–15లో ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాజీ పేటలో జరిగిన జిల్లాస్థాయి పైకా పోటీల్లో పాల్గొని సత్తాచాటాడు. తాజాగా మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో జరిగిన జాతీయస్థాయి అండర్–17 విభాగంలో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చి ఆగస్టు 16న నేపాల్ రాజధాని ఖాట్మాండులో జరిగే సౌత్ ఏషియన్ పోటీలకు ఎంపికయ్యాడు. ఇద్దరికి ఆర్థిక ఇబ్బందులు నిరుపేద కుటుంబాలకు చెందిన అనిల్, నితీష్కు నేపాల్కు వెళ్లేందుకు ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. కబడ్డీలో రాణిస్తున్నప్పటికీ ప్రభుత్వ ప్రోత్సాహం కరువవడంతో వారు ఆవేదనకు గురవుతున్నారు. దాతలు, క్రీడాభిమానులు ఆర్థిక సాయం అందిస్తే నేపాల్లో జరిగే సౌత్ ఏషియన్ పోటీల్లో సత్తాచాటి ఓరుగల్లు కీర్తిని నిలబెడుతామని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. -
హోం శాఖను తనవద్దే ఉంచుకున్న నితీష్
పాట్నా: ఐదోసారి బిహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కీలకమైన హోం శాఖను నితీష్ తన వద్దే ఉంచుకున్నాడు. నితీష్ కేబినెట్లో లాలు ప్రసాద్ కుమారులకు కీలకమైన మంత్రి పదవులు దక్కాయి. లాలు చిన్న కుమారుడు 26 ఏళ్ల తేజస్వికు రోడ్డు, భవనాల శాఖ మంత్రిత్వ శాఖను కేటాయించడంతో పాటు ఉపముఖ్యమంత్రి హోదాను ఇవ్వడం జరిగింది. లాలు పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్కు ఆరోగ్యశాఖను కేటాయించారు. నితీష్ కేబినెట్లో మొత్తం 28 మంది సభ్యులు మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరిలో అబ్దుల్ బారి సిద్ధిఖీ, రాజీవ్ రంజన్ సింగ్, బిజేంద్ర ప్రసాద్ యాదవ్, జయ కుమార్ సింగ్, శ్రావణ్ కుమార్ సింగ్, అలోక్ మెహతా తదితరులు ఉన్నారు. -
లారీ ఢీకొని బాలుడి మృతి
విశాఖపట్నం: విశాఖ జిల్లాలో ఆడుకుంటున్న చిన్నారిని లారీ ఢీకొట్టడంతో బాలుడు అక్కడిక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన పద్మనాభం మండలం పాండ్రంగి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పాండ్రంగి నితీష్(3) ఇంటి ముందు ఉన్న వేణుగోపాల స్వామి ఆలయం ఎదుట ఆడుకుంటున్న సమయంలో గోస్తని నది నుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో నితీష్ అక్కడికక్కడే మృతిచెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
ఒక్కరోజులోనే రూ.800 కోట్లు నష్టపోయిన రేఖా ఝున్ఝున్వాలా
సీఎం జగన్ కోసం రాజానగరం సిద్ధం(ఫొటోలు)
ఓటర్లపై తేనెటీగల దాడి.. ఎనిమిదిమందికి గాయాలు!
'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
టీడీపీ నేతల దౌర్జన్యాలు అరికట్టాలి
'ఇరానీ చాయ్'ని పరిచయం చేసిందెవరో తెలుసా! ది బెస్ట్ ఎక్కడంటే..
కేజ్రీవాల్కు ఎందుకు బెయిల్ ఇవ్వొద్దు : ఈడీని ప్రశ్నించిన సుప్రీం
టీడీపీ గూండాగిరి
తప్పక చదవండి
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నారా? హార్దిక్ సమాధానం ఇదే!
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వారందరి జీవితాలను మార్చేసిన 'ఆర్య'కు 20 ఏళ్లు
- వైజాగ్ మాల్యా.. వంశీ!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
Advertisement