
సూపర్ స్టార్ మహేశ్బాబు (Mahesh Babu) కుటుంబం ఇటీవలే ఇటలీ టూర్కు వెళ్లింది. అక్కడ ప్రియాంక చోప్రా భర్త, సింగర్, నటుడు నిక్ జోనస్ (Nick Jonas).. 'ద లాస్ట్ ఫైవ్ ఇయర్స్' షోకు నమ్రత (Namrata Shirodkar) హాజరైంది. కూతురు సితార, తనయుడు గౌతమ్తో కలిసి ఆ షోను ఎంజాయ్ చేసింది. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ద లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నాటకంలో నిక్ జోనస్ నటన అద్బుతంగా ఉందని కొనియాడింది. ఈ షోకు ప్రత్యేకంగా ఆహ్వానించినందుకు ప్రియాంకచోప్రాకు కృతజ్ఞతలు తెలిపింది.
ఈ పోస్ట్పై ప్రియాంక స్పందిస్తూ.. మీ సమయం సంతోషకరంగా సాగినందుకు సంతోషం అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది. ఇకపోతే మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఇటీవలే ఒడిశాలో పూర్తయింది. త్వరలోనే రెండో షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఇక్కడ మహేశ్బాబు- ప్రియాంక చోప్రా జంటగా సినిమా చేస్తుంటే.. అక్కడ ప్రియాంక భర్త నటించిన షోను మహేశ్ ఫ్యామిలీ చూసి ఎంజాయ్ చేసిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
చదవండి: 'కోర్ట్' హీరో కొత్త మూవీ.. సైలెంట్గా ఓటీటీలో స్ట్రీమింగ్