MAA Elections 2021: జీవితపై చర్యలు తీసుకోవాలంటూ పృథ్వీ ఫిర్యాదు

MAA Elections 2021: Prithvi Complained To Election Officer Over Jeevitha - Sakshi

MAA Elections 2021: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల్లో మరో వివాదం చోటుచేసుకుంది. జీవితపై చర్యలు తీసుకోవాలంటూ నటుడు పృథ్వీరాజ్ ఎన్నికల ఆఫీసర్‌కు ఫిర్యాదు చేశారు. జీవిత తనకు ఓటు వేస్తేనే లాభాలు ఉన్నాయి అంటూ కొందరిని మభ్య పెడుతుందని, నిబంధనల ప్రకారం ఆమెపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల ఆఫీసర్‌కు ఆయన లేఖ రాశారు.

పృథ్వి ప్రస్తుతం మంచు విష్ణు ప్యానల్‌ నుంచి వైస్‌ ప్రెసిడెంట్‌గా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా గతంలో ఎన్నడూ లేని విధంగా మా ఎన్నికలు రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఈసారి ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. అక్టోబర్‌ 10న మా ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. 

చదవండి : MAA Elections 2021: మంచు విష్ణుకు నరేష్‌ మద్దతు
MAA Elections 2021: మంచు విష్ణు ప్యానల్‌ ఇదే

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top