కొత్త మలుపు | Kotha Malupu Trailer Launch | Sakshi
Sakshi News home page

కొత్త మలుపు

Jun 3 2026 3:39 AM | Updated on Jun 3 2026 3:39 AM

Kotha Malupu Trailer Launch

భైరవి, ఆకాష్, సునీత

ప్రముఖ గాయని సునీత తనయుడు ఆకాష్‌ హీరోగా నటించిన చిత్రం ‘కొత్త మలుపు’. శివ వరప్రసాద్‌ కేశనకుర్తి దర్శకత్వం వహించిన ఈ మూవీలో భైరవి ఆర్థ్యా కథానాయిక. తాటి బాలకృష్ణ నిర్మించిన ఈ సినిమాని మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్‌ ఈ నెల 12న విడుదల చేయనుంది. 

ఈ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌కి నటుడు భానుచందర్, గాయని సునీత, నిర్మాత సి. కల్యాణ్‌ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరు అయ్యారు. ‘‘గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ప్రేమకథా చిత్రమిది’’ అని తాటి బాలకృష్ణ తెలి పారు. ‘‘లవ్, సస్పెన్స్ జానర్‌లో ఈ సినిమాను రూపొందించాం’’ అని శివ వరప్రసాద్‌ పేర్కొన్నారు. ‘‘ఈ సినిమాతో ఆకాష్‌ మంచి స్థాయికి చేరుకోవాలి’’ అన్నారు సునీత.

Advertisement
 
Advertisement
Advertisement