చేతిలో అవకాశాలు ఫుల్గా ఉన్న నటి కయాదు లోహర్. తమిళం తెలుగు మలయాళం అంటూ ఇప్పుడు దక్షిణాది సినిమాను చుట్టే స్తోందనే చెప్పాలి. ఈ బ్యూటీ నటించిన ఒక తెలుగు చిత్రం, ఒక మలయాళ చిత్రం ఒకే సారి విడుదల అవ్వడం విశేషం. అందులో ఒకటి జీవీ ప్రకాష్ కుమార్ సరసన నటించిన ఇమ్మార్టల్ కాగా, మరొకటి దుల్కర్ సల్మాన్తో జత కట్టిన ఐయామ్ గేమ్ చిత్రం.
జీవి ప్రకాష్ కుమార్ కు జంటగా నటించిన ఇమ్మార్టల్ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనకుండా, ఐయామ్ గేమ్ చిత్ర ప్రమోషన్స్ కార్యక్రమాల్లో పాల్లొందనే విమర్శలను కయాదు లోహర్ ఎదుర్కొంటోంది. అయితే ఈ రెండు చిత్రాలు మిశ్రమ స్పందనతోనే ప్రదర్శింపబడుతున్నాయి. దీంతో డ్రాగన్ చిత్రం తరువాత ఈ అమ్మడికి సరైన సక్సెస్ రాలేదు. అయితే ఇటీవల విమర్శలను ఎదుర్కొంటోంది. బిజీగా ఉన్న నటికి విమర్శలు ఎదురవ్వడం సహజమే.
కాగా తనపై వస్తున్న విమర్శలపై ఒక భేటీలో స్పందించిన ఈ భామ.. తాను ప్రస్తుతం సూర్యకు జంటగా నటిస్తున్న చిత్రం షూటింగ్లో పాల్గొంటూ బిజీగా ఉన్నానని, ఒక్క రోజు కాల్ షిట్ను మాత్రమే ఐయామ్ గేమ్ చిత్ర ప్రమోషన్స్కు కేటాయించినట్లు చెప్పుకొచ్చింది. అయితే ఇమ్మార్టల్ చిత్ర ప్రమోషన్ లో పాల్గొనడానికి సమయం లేకపోయిందని పేర్కొంది. ఇకపోతే గ్లామర్ గురించి అడుగుతున్నారని, అయితే కథానాయికలు అనవసరంగా ఆట బొమ్మలుగా చూపించడానికి తాను వ్యతిరేకమని అన్నారు. అయితే కథకు తప్పని సరి అయితే, ఆ పాత్ర నమ్మదగినదిగా తనకు అనిపిస్తే హద్దులు మీరని గ్లామర్ కు సమ్మతిస్తానని పేర్కొంది. అంతే కానీ ఎవ రి దృష్టిలో పడాలనో అందాలారబోయనని కయాదు లోహర్ వెల్లడించారు.


