సాయిబాబా జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘తేరా సాయి’. పలాశ్ ముచ్చల్ దర్శకుడు. ఈ చిత్రంలో సంజయ్ మిశ్రా సాయి బాబాగా కనిపించనున్నారు. ఈ సినిమా 2027 ఫిబ్రవరి 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓకే సారి తెలుగు, హిందీ, తమిళం, మరాఠీ భాషల్లో విడుదల కానుంది. షాయాజీ షిండే, మనోజ్ జోషి, అవికా గోర్ తదితరులు కీలకపాత్ర వహిస్తున్నారు.
కాగా ఇప్పటికే ఈ తరహా చిత్రాలు తెలుగులో విడుదలయ్యాయి. 2012లో వచ్చిన ‘షిర్డీ సాయి’ చిత్రంలో కింగ్ నాగార్జున బాబా పాత్రను పోషించిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.
చదవండి: స్నేహితులుగా ఎంట్రీ.. బిగ్బాస్లో ప్రత్యర్థులవుతారా..


