విజయ్ సేతుపతి, సాయిపల్లవి హీరో హీరోయిన్లుగా మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న తమిళ సినిమాకు ‘ఇంజి వెల్లం’(తెలుగులో అల్లం బెల్లం అని అర్థం) అనే టైటిల్ ఖరారైంది. ఈ రొమాంటిక్ డ్రామా సినిమాను సుభాస్కరన్ , మణిరత్నం, శివ అనంత్ నిర్మిస్తున్నారు.
సోమవారం ఈ సినిమా టైటిల్, ఫస్ట్లుక్ను రిలీజ్ చేసి, ఈ చిత్రాన్ని జనవరిలో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ సినిమా మేజర్ స్టోరీ కోల్కతా బ్యాక్డ్రాప్తో సాగుతుందని తెలిసింది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ స్వరాలు అందిస్తున్నారు.


