
‘సర్దార్’ సీక్వెల్ ‘సర్దార్ 2’ షూటింగ్ సమాప్తం అయింది. హీరో కార్తీ, దర్శకుడు పీఎస్ మిత్రన్ కాంబినేషన్లో రూపొందిన స్పై యాక్షన్ డ్రామా ‘సర్దార్’. 2022 అక్టోబరులో విడుదలైన ఈ సినిమా సూపర్హిట్గా నిలిచింది. తాజాగా కార్తీ, పీఎస్ మిత్రన్ కాంబినేషన్లోనే ‘సర్దార్’ సినిమాకు సీక్వెల్గా ‘సర్దార్ 2’ రానుంది.
ఈ సీక్వెల్ చిత్రీకరణ పూర్తయినట్లుగా మేకర్స్ వెల్లడించారు. కార్తీ టైటిల్ రోల్లో నటించిన ఈ చిత్రంలో మాళవికా మోహనన్, ఆషికా రంగనాథ్, రజీషా విజయన్ హీరోయిన్లుగా నటించగా, ఎస్జే సూర్య పవర్ఫుల్ పాత్రలో నటించారు. ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై ఎస్. లక్ష్మణ్ కుమార్ ఈ సినిమాను నిర్మించారు. ‘‘పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలోనే ఇతర వివరాలను వెల్లడిస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఇక ‘సర్దార్’ సినిమాలో తండ్రీకొడుకులుగా కార్తీ ద్విపాత్రాభినయం చేశారు. సీక్వెల్లోనూ ద్విపాత్రాభినయం చేసినట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: యువన్ శంకర్ రాజా.