
శుక్ర, మాటరాని మౌనమిది, ఏ మాస్టర్ పీస్ వంటి వినూత్న చిత్రాలతో ఆకట్టుకున్న దర్శకుడు పూర్వాజ్. ఆయన తెరకెక్కించిన తాజా సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ కిల్లర్. ఈ చిత్రంలో పూర్వాజ్ హీరోగా నటించగా, జ్యోతి పూర్వాజ్ హీరోయిన్గా నటించారు. విశాల్ రాజ్, గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీని థింక్ సినిమా బ్యానర్పై ఏయు అండ్ ఐ, మెర్జ్ ఎక్స్ ఆర్ సంస్థలతో కలిసి పూర్వాజ్, ప్రజయ్ కామత్, ఎ. పద్మనాభ రెడ్డి నిర్మించారు.
తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ నెల 30న ఈ సినిమా గ్లింప్స్ను విడుదల చేయనున్నట్లుగా మేకర్స్ పేర్కొన్నారు. కిల్లర్.. పార్ట్ 1: డ్రీమ్ గర్ల్ షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ సరికొత్త సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ లవ్, రొమాన్స్, రివెంజ్, థ్రిల్లర్ అంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది. ఈ సినిమాను త్వరలోనే విడుదల చేస్తామని చిత్రబృందం పేర్కొంది.