
కోలీవుడ్ ప్రముఖ సినీ నటుడు, మక్కళ్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ త్వరలో పార్లమెంట్లో అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. రాజ్యసభ సభ్యుడిగా ఆయన పదవి అందుకోనున్నారని ఆ పార్టీ ఉపాధ్యక్షుడు తంగవేల్ అధికారికంగా ప్రకటించారు. తమిళనాడులో అధికార పార్టీ డీఎంకే ఆయన్ను రాజ్యసభకు నామినేట్ చేయనుందంటూ కొద్దిరోజులుగా మీడియాలో కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తమిళనాడులోని కోయంబత్తూర్లో దానిని తంగవేల్ ద్రవీకరించారు. తమ నేత రాజ్యసభ సభ్యుడిగా పార్లమెంట్లో అడుగుపెడుతారని ఆయన చెప్పారు.
2021 శాసనసభ ఎన్నికల్లో స్టాలిన్ గెలుపు కోసం డీఎంకేతో కమల్ పార్టీ పొత్తు పెట్టుకుంది. ఇందులో భాగంగా రాజ్యసభ సీటు కేటాయించేలా ఒప్పందం కుదిరిందని తెలిసింది. ఈ క్రమంలో జూన్ 2025 నాటికి ఆరు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. అందులో డీఎంకే నుంచి రెండు ఖాళీలు ఏర్పడనున్నాయి. ఒకరి స్థానంలో కమల్కు అవకాశం కల్పించవచ్చని చర్చ జరుగుతోంది. కమల్ హాసన్ ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. త్వరలో ఆయన ఇండియాకు రానున్నారు. ఇంతలో ప్రకటన రావచ్చని తెలుస్తోంది.