
తెలుగులో కొన్ని సినిమాలకు రిపీట్ వాల్యూ ఉంటుంది. అంటే ఎన్నిసార్లు చూసినా సరే బోర్ కొట్టదు. అలాంటి వాటిలో రవితేజ 'వెంకీ' ఒకటి. ఇది రిలీజై దాదాపు 20 ఏళ్లు దాటేసింది. కానీ ఇప్పటికీ ఈ మూవీలోని కామెడీ సీన్స్ని చూసి ఆడియెన్స్ భలే ఎంజాయ్ చేస్తుంటారు. వాళ్లలో మీరు కూడా ఒకరు అయ్యిండొచ్చు. కానీ దర్శకుడు ఓ విషయంలో మాత్రం మాయ చేశాడు. ఇన్నేళ్ల తర్వాత దాని గురించి బయటపెట్టాడు.
(ఇదీ చదవండి: మూడుసార్లు సినిమా చూశారు.. మరో మూవీ చేస్తానని పవన్ హామీ: డైరెక్టర్)
దర్శకుడు శ్రీనువైట్ల రేంజ్ పెంచిన సినిమా 'వెంకీ'. మరీ ముఖ్యంగా ఈ సినిమాలోని ట్రైన్ కామెడీ సీన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక అసలు విషయానికొస్తే.. ఇదే శ్రీనువైట్ల తీసిన 'ఢీ' మూవీ రీ రిలీజ్ అయిన సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒకప్పటి సంగతులు చాలానే చెప్పారు. పనిలో పనిగా 'వెంకీ' గురించి ప్రస్తావన వచ్చేసరికి ఇప్పటివరకు ప్రేక్షకులకు తెలియని విషయాన్ని బయటపెట్టారు.
వెంకీ సినిమాలో హీరో పేరు కూడా అదే. కానీ షూటింగ్ జరుగుతున్నప్పుడు శీను అనే పేరుతో తీసేశారు. చివరకు టైటిల్ కూడా శీను అనే పెడదామని అనుకున్నారట. కానీ చివర్లో దర్శకుడికి ఎందుకో 'వెంకీ' అని టైటిల్ పెడదామనిపించింది. ఇదే విషయాన్ని రైటర్తో మాట్లాడితే.. వేరే హీరో పేరు ఎందుకు పెట్టడం? రవితేజ అని టైటిల్ పెట్టేద్దాం అని సూచించారట. కానీ హీరో రవితేజ 'వెంకీ' టైటిల్ వైపు మొగ్గు చూపడంతో చివరగా అదే ఫిక్సయ్యామని, డబ్బింగ్లో శీను అనే పేరుని కాస్త వెంకీగా మార్చాం అని శ్రీనువైట్ల చెప్పుకొచ్చారు.
(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 33 సినిమాలు)