
ధనుష్ హీరోగా నటించిన రొమాంటిక్ లవ్స్టోరీ మిస్టర్ కార్తీక్ మళ్లీ థియేటర్స్లోకి రాబోతుంది. ధనుష్ పుట్టినరోజు సందర్భంగా జులై 28న మిస్టర్ కార్తీక్ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. . ఓం శివగంగా ఎంటర్ప్రైజెస్ బ్యానర్ పై శ్రీమతి కాడబోయిన లతా మండేశ్వరి సమర్పణలో నిర్మాత కాడబోయిన బాబురావు ఈ సినిమాను తెలుగులో రీ రిలీజ్ చేస్తున్నారు.
రిచా గంగోపాధ్యాయ హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి శ్రీ రాఘవ దర్శకత్వం వహించారు. ‘మయక్కమ్ ఎన్న’ టైటిల్లో2016లో తమిళ్లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఆ తర్వాత మిస్టర్ కార్తీక్ పేరుతో ఈ సినిమాను తెలుగులో విడుదల చేశారు. ‘‘ఈ చిత్రంలో హీరో–హీరోయిన్ మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఇటీవల తమిళంలో మళ్లీ విడుదల చేయగా, మంచి విజయం దక్కింది. తెలుగులోనూ మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం ఉంది’’ అని కాడబోయిన బాబురావు పేర్కొన్నారు.