Devatha : అలా ఎందుకు జరిగిందో వివరించిన ఆదిత్య.. | Devatha Serial : Rukmini Decides To Marry Adithya And Satya | Sakshi
Sakshi News home page

Devatha :ఆదిత్య తీరుతో రుక్మిణి మనసు మార్చుకుంటుందా?

Jul 6 2021 2:53 PM | Updated on Jul 6 2021 3:19 PM

Devatha Serial : Rukmini Decides To Marry Adithya And Satya - Sakshi

నిజం తెలిసిన భాగ్యమ్మ తన కూతుళ్లకు ఇలా ఎందుకు జరిగిందంటూ బాధపడిపోతుంది. మరోవైపు ఈ పరిస్థితి నుంచి సత్యకు దారి చూపాలని రుక్మిణి భీష్మించుకుంటుంది. ఆదిత్య-సత్యలకు పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటుంది. దీంతో కమల , భాగ్యమ్మ షాక్‌ అవుతారు. అలా చేస్తే నీ జీవితం నాశనం అవుతుందని వివరిస్తారు. అయినా రుక్మిణి మాత్రం పట్టు వీడదు. తను అనుకన్నది చేస్తానని చెప్తుంది. మరోవైపు సత్యతో తనకున్న బంధం, తను గర్బవతి కావడం వంటి విషయాలను ఆదిత్య తన తండ్రికి వివరిస్తాడు. ఇది కేవలం తన ప్రాణాలు కాపాడటం కోసం సత్య చేసిన త్యాగమని, ఇందులో తప్పు లేదని చెప్తాడు. ఇలాంటి ఇంట్రెస్టింగ్‌ విశేషాలతో .దేవత సీరియల్‌ జులై 6న 278వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూసేయండి..

రుక్మిణి బయటపెట్టిన నిజంతో ఇంట్లో అందరూ ఏం చేయాలో తెలియని సందిగ్ధంలో చిక్కుకుపోయారు. తన ఇద్దరు కూతుళ్లకు ఇలాంటి పరిస్థితి దాపరించింది ఏంటి అంటూ భాగ్యమ్మ బాధలో మునిగిపోతుంది. మరోవైపు ఇప్పుడు ఏం చేయబోతున్నావ్‌ అంటూ రుక్మిణిని అడగ్గా..సత్య కోరుకుందే చేయాలని నిర్ణయించుకున్నా అని సమాధానమిస్తుంది. సత్యకు, ఆదిత్యలకు పెళ్లి చేస్తానని చెప్పడంతో కమల, భాగ్యమ్మ షాక్‌ అవుతారు. ఇలా చేస్తే నీ జీవితం ఏం కావాలంటూ ప్రశ్నిస్తారు. అయినప్పటికీ సత్య జీవితం నిలబడాలి అంటే ఇది చేయక తప్పదు అని రుక్మిణి తన నిర్ణయాన్ని స్పష్టం చేస్తుంది. సీన్‌ కట్‌ చేస్తే..ఇంత తప్పు ఎలా జరిగిందంటూ ఈశ్వర్‌ ప్రసాద్‌ ఆదిత్యను నిలదీస్తాడు. దీంతో తాను అనారోగ్యం పాలైనప్పుడు సత్య చేసిన త్యాగాన్ని వివరిస్తాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు తనను బతికించడానికి సత్య ఇలా చేసిందని, ఇందులో తమ తప్పు లేదని ఆదిత్య తన గతం గురించి వివరిస్తాడు.

కేవలం తన ప్రాణాలు నిలబెట్టడానికి సత్య చేసిన ప్రయత్నమని చెబుతాడు. దీంతో ఆదిత్యను అర్థం చేసుకున్న ఈశ్వర్‌ ప్రసాద్‌ ఇదే విషయాన్ని దేవుడమ్మకు చెప్పమని కోరుతాడు. ఆదిత్య తన తల్లి వద్దకు వెళ్లి జరిగిన నిజం గురించి వివరించేందుకు ప్రయత్నించగా, దేవుడమ్మ వినడానికి సిద్ధపడదు. ఇప్పటిదాకా జరిగింది చాలని, ఇక తానేమీ వినాలనుకోవడం లేదని బదులిస్తుంది. కొడుకు చేసిన మోసాన్ని తట్టుకొని కుమిలిపోతుంది. మరోవైపు ఆదిత్యను ఓదార్చేందుకు రుక్మిణి ప్రయత్నిస్తుంది. సత్య గర్భవతి కావడంలో ఆదిత​ తప్పు లేదని తెలుసుకున్న రుక్మిణి మనసు మార్చుకుంటుందా అన్నది తర్వాతి ఎపిసోడ్‌లో చూద్దాం. 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement