
రూ. 75 కోట్లతో గ్రాఫిక్స్
‘విశ్వంభర’ విజువల్స్ ప్రేక్షకులను అబ్బురపరిచేలా ఉండబోతున్నాయని తెలిసింది. చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న సోషియో ఫ్యాంటసీ యాక్షన్ మూవీ ‘విశ్వంభర’. వంశీ, ప్రమోద్, విక్రమ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో త్రిష, ఆషికా రంగనాథ్ కథానాయికలుగా నటిస్తున్నారు.
ఒక పాట మినహా ఈ సినిమా పూర్తయిందట. పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. కాగా ఈ సినిమాలోని గ్రాఫిక్స్ కోసమే రూ. 75 కోట్లకు పైగా ఖర్చు పెడుతున్నారని సమాచారం. హాలీవుడ్ సాంకేతిక నిపుణులు ఈ సినిమా కోసం పని చేస్తున్నారు. సో... విజువల్స్ పరంగా ‘విశ్వంభర’ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది.