Viswambhara Movie
-
భారీ విశ్వంభర
‘విశ్వంభర’ విజువల్స్ ప్రేక్షకులను అబ్బురపరిచేలా ఉండబోతున్నాయని తెలిసింది. చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న సోషియో ఫ్యాంటసీ యాక్షన్ మూవీ ‘విశ్వంభర’. వంశీ, ప్రమోద్, విక్రమ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో త్రిష, ఆషికా రంగనాథ్ కథానాయికలుగా నటిస్తున్నారు.ఒక పాట మినహా ఈ సినిమా పూర్తయిందట. పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. కాగా ఈ సినిమాలోని గ్రాఫిక్స్ కోసమే రూ. 75 కోట్లకు పైగా ఖర్చు పెడుతున్నారని సమాచారం. హాలీవుడ్ సాంకేతిక నిపుణులు ఈ సినిమా కోసం పని చేస్తున్నారు. సో... విజువల్స్ పరంగా ‘విశ్వంభర’ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. -
'విశ్వంభర' నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్
-
'విశ్వంభర'లో శ్రీలీల.. గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'విశ్వంభర' సినిమా చేస్తున్నారు. లెక్క ప్రకారం సంక్రాంతికే రిలీజ్ అవ్వాలి కానీ ఇప్పటికీ ఇంకా షూటింగ్ నడుస్తోంది. తాజాగా శ్రీలీల కూడా చిత్రీకరణలో పాల్గొంది. ఈ క్రమంలోనే చిరు.. యువ హీరోయిన్ కి క్యూట్ బహుమతి ఇచ్చారు. ఆ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' నటి)రీసెంట్ టైంలో సరైన హిట్స్ పడకపోవడంతో శ్రీలీల.. తెలుగు సినిమాలు తగ్గించేసింది. హిందీలో ఓ మూవీ చేస్తోంది. ఇప్పుడు ఈమెని చిరు 'విశ్వంభర' కోసం తీసుకున్నారు. తాజాగా రిలీజ్ చేసిన ఫొటోలతో ఈ క్లారిటీ వచ్చేసింది. మహిళా దినోత్సవం సందర్భంగా శ్రీలీలకు దుర్గ దేవి ప్రతిమ గల శంఖాన్ని చిరంజీవి బహుమతిగా ఇచ్చారు. ఈ ఫొటోలు చూస్తే చిరు-శ్రీలీల ఏదో పాట షూటింగ్ కోసం సిద్ధమైనట్లు కనిపిస్తున్నారు. మరి శ్రీలీల.. సినిమాలో ప్రత్యేక గీతం ఏమైనా చేస్తోందా? పాత్రలో నటిస్తుందా అనేది తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: గోదావరిలో అస్థికలు కలిపిన యాంకర్ రష్మీ) -
చిరంజీవి కోసం ప్రభాస్ కాంప్రమైజ్ కానున్నాడా..?
సలార్, కల్కి 2898ఏడీ లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమా 'రాజాసాబ్'. హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీస్తున్న ఈ మూవీకి మారుతి దర్శకుడు. చాలావరకు ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తున్నట్లు చాన్నాళ్ల క్రితమే ప్రకటించారు కూడా.. అయితే, ఇప్పుడు అనుకున్న సమయానికి ఈ చిత్రం విడుదల కాకపోవచ్చని తెలుస్తోంది. ఈమేరకు ఇండస్ట్రీలో వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి.‘రాజాసాబ్’ చిత్రాన్ని భారీ బడ్జెట్తో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇందులో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్స్గా నటిస్తున్నారు. 2025 జనవరి సమయానికి ఈ చిత్రం షూటింగ్ కూడా పూర్తి అవుతుంది. కానీ, ఈ సినిమాలో ఎక్కువ సీన్స్కు VFX వర్క్తో లింక్ అయి ఉన్నాయట. దీంతో ఏప్రిల్ 10 నాటికి కూడా ఆ పనులు పూర్తి కావడం కాస్త కష్టమేనని తెలుస్తోంది. సమ్మర్కు విడుదల అవుతుందని అశించిన ప్రభాస్ ఫ్యాన్స్కు నిరాశే ఎదురుకానుందని తెలుస్తోంది. అయితే, సంక్రాంతి కానుకగా ఒక సాంగ్ను విడుదల చేస్తున్నట్లు సమాచారం.చిరంజీవి కోసం ప్రభాస్ కాంప్రమైజ్చిరంజీవి 'విశ్వంభర' సంక్రాంతి రేసు నుంచి తప్పుకుంటూ గేమ్ ఛేంజర్కు ఛాన్స్ ఇచ్చారు. అయితే, విశ్వంభర ఎప్పుడు విడుదల అవుతుందో మాత్రం వారు ప్రకటించలేదు. అయితే, వచ్చే ఏడాది ఏప్రిల్ 10న విడుదల కానుందని నెట్టింట ఒక వార్త వైరల్ అవుతుంది. అదే డేట్కు ప్రభాస్ రాజాసాబ్ వస్తున్నట్లు ఇప్పటికే ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. కానీ, విశ్వంభర సినిమాను ప్రభాస్ అనుబంధ సంస్థ యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుండటంతో మెగాస్టార్కు పోటీగా ఆయన ఎట్టి పరిస్థితిల్లో బరిలోకి దిగడని తెలుస్తోంది. ఈ కారణం వల్ల రాజాసాబ్ ఏప్రిల్ 10న విడుదల కాకపోవచ్చని కూడా సమాచారం. ప్రభాస్ లిస్ట్లో ఇప్పటికే చాలా సినిమాలు ఉన్నాయి. కె.జి.ఎఫ్, సలార్ వంటి భారీ చిత్రాలను నిర్మించిన హోంబలే ఫిలింస్తో ప్రభాస్ మూడు సినిమాలు చేయనున్నారు. 'సలార్2'తో ఈ ప్రయాణం మొదలవుతోందని ఆ నిర్మాణ సంస్థ ఇప్పటికే ప్రకటించింది. 2026, 2027, 2028 సంవత్సరాల్లో ఆ సినిమాలు రానున్నట్లు కూడా తెలిపింది. ప్రభాస్ - ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో ఒక సినిమాతో పాటు ప్రభాస్ - లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో మరో సినిమా తెరకెక్కించాలని ఈ సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. సందీప్ వంగా దర్శకత్వంలో స్పిరిట్ సినిమా కూడా లైన్లో ఉన్న విషయం తెలిసిందే. -
'విశ్వంభర' టీజర్లో గ్రాఫిక్స్పై ట్రోల్స్
మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' టీజర్ రిలీజైంది. ముందు నుంచే చెబుతున్నట్లు ఇది సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ ఉన్న స్టోరీతో తీస్తున్న సినిమా.. అందుకు తగ్గట్లే టీజర్లో గ్రాఫిక్స్ ఉన్నాయి. మెగా ఫ్యాన్స్కి చిరు గ్రేస్తో పాటు అన్నీతెగ నచ్చేస్తుంటే.. మిగిలిన వాళ్లలో కొందరు మాత్రం గ్రాఫిక్స్ షాట్స్ విషయమై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.(ఇదీ చదవండి: సూపర్ హీరోగా బాలకృష్ణ.. వీడియో రిలీజ్)అలానే టీజర్ ప్రారంభంలో చూపించే అంతరిక్షం సీన్.. హాలీవుడ్ హిట్ సినిమా 'అవెంజర్స్' నుంచి తెచ్చి పెట్టారని ప్రూఫ్స్తో ట్వీట్స్ పెడుతున్నారు. మరికొందరైతే గ్రాఫిక్స్ నేచురల్గా లేవని అంటున్నారు. మూవీ రిలీజ్ టైంకి ఇవన్నీ కాస్త కరెక్ట్ చేసుకోవాలని సూచిస్తున్నారు. చిరంజీవిని ఏం అనట్లేదు గానీ గ్రాఫిక్స్ విషయంలో దర్శకుడు వశిష్ఠ కేర్ తీసుకోలేదని విమర్శిస్తున్నారు. ఇతడిని 'ఆదిపురుష్' దర్శకుడు ఓం రౌత్తో పోల్చి ట్రోల్ చేస్తున్నారు.చిరంజీవి, త్రిష జంటగా నటిస్తున్న ఈ సినిమాని లెక్క ప్రకారం సంక్రాంతికి థియేటర్లలో రిలీజ్ చేయాలి. కానీ 'గేమ్ ఛేంజర్' కోసం దీన్ని వాయిదా వేశారు. ఈ విషయాల్ని అధికారికంగా ప్రకటించారు. అంటే 'విశ్వంభర' వచ్చేది వేసవికే అనమాట. ఏప్రిల్లో 'రాజా సాబ్' ఉంది కాబట్టి మేలోనే రిలీజయ్యే ఛాన్సులు ఎక్కువ. మరి చూడాలి ఏ డేట్ ఫిక్స్ చేస్తారో?(ఇదీ చదవండి: పండగ సినిమాల రివ్యూ.. ఏది ఎలా ఉందంటే?)MEGA fans thappa andaru konchem disappointed feel lo ne unnaru ga teaser choosi 😴😴😴 Its nice that they postponed to Summer 2025 ..Work well on Vfx and bring out GRANDDD OUTPUT ..plz don't go PAN-INDIA with this movie @UV_Creations 🙏⭐️ @KChiruTweets⭐️ #ViswambharaTeaser 👎 pic.twitter.com/zOX9eJWOII— ★ Movie Monster ★ (@movie_monsterz) October 12, 2024#ViswambharaTeaser - Storyline definitely looks thrilling but VFX could have been better. Aa chota k naidu mida antha interest enti boss aadi cinematography outdated asalu, small range movies kuda adni consider cheyatle 🤦🏻♂️Btw, Boss in this frame 🔥 pic.twitter.com/CtYwzZZjMS— CK (@Chanti616) October 12, 2024 -
చిరంజీవి సినిమాని శ్రీలీల రిజెక్ట్ చేసిందా?
టాలీవుడ్లోకి రాకెట్లా దూసుకొచ్చింది శ్రీలీల. తెలుగు మూలులున్నప్పటికీ కన్నడ సినిమాలతో నటిగా మారింది. 'పెళ్లి సందD'తో హీరోయిన్గా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. గతేడాదిలో నెలకో మూవీతో ప్రేక్షకుల్ని పలకరించింది. అవన్నీ కూడా బాక్సాఫీస్ దగ్గర ఫెయిలయ్యాయి. దీంతో సైలెంట్ అయిపోయింది. అలాంటిది ఈమెకు మెగా ఛాన్స్ వస్తే నో చెప్పిందనే న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: బిగ్బాస్ 8 తెలుగు షోలో టాలీవుడ్ హీరో?)శ్రీలీల ప్రస్తుతం హిందీ, తెలుగులో తలో సినిమా చేస్తోంది. అయితే గతేడాది చేసిన సినిమాలన్నీ ఫెయిలవడంతో ఆలోచనలో పడిన శ్రీలీల.. ఈసారి ఆచితూచి మూవీస్ చేయాలని అనుకుంటోందట. అదలా ఉంచితే చిరంజీవి ప్రస్తుతం 'విశ్వంభర' అనే సోషియో ఫాంటసీ మూవీ చేస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి థియేటర్లలోకి రానుంది.చిరుతో పాటు ఇందులో ఆషికా రంగనాథ్, సురభి, ఈషా చావ్లా తదితరులు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఇందులో ఓ ప్రత్యేక గీతంలో డ్యాన్స్ చేసేందుకు శ్రీలీలని సంప్రదించారట. కానీ ఈమె నో చెప్పిందట. రెమ్యునరేషన్ ఎక్కువ ఇస్తామని చెప్పినా సరే మొహమాటం లేకుండా రిజెక్ట్ చేసిందని టాక్ వినిపిస్తోంది.(ఇదీ చదవండి: తంగలాన్ కోసం విక్రమ్ కష్టం.. మేకింగ్ వీడియో విడుదల) -
'విశ్వంభర' బ్యూటీ.. జీన్స్లో అందమే అసూయపడేలా! (ఫొటోలు)
-
వెకేషన్లో 'విశ్వంభర' బ్యూటీ.. తెగ ముద్దొచ్చేస్తుంది! (ఫొటోలు)