Itlu Maredumilli Prajaneekam: ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం.. ఫస్ట్ సాంగ్ విడుదలకు రెడీ

Allari Naresh Latest Movie Itlu Maredumilli Prajaneekam Update - Sakshi

అల్లరి నరేశ్, ఆనంది జంటగా తెరకెక్కుతున్న చిత్రం 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'. ఈ చిత్రానికి ఏఆర్ మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. హాస్య మూవీస్ పతాకంపై రాజేశ్ దండు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.  తాజాగా ఈ మూవీకి సంబధించిన కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ చిత్ర ఫస్ట్ సింగిల్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్.

ఈ సినిమాలోని 'లచ్చిమి' అనే సాంగ్‌ను అక్టోబర్ 4న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. నాంది మూవీ తర్వాత అల్లరి నరేశ్ నటించిన చిత్రం కావడంతో ఫ్యాన్స్‌లో ఆసక్తి నెలకొంది. ఈ సినిమాకు సాయి చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం నవంబర్ 11న థియేటర్లలో అభిమానులను పలకరించనుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top