Priyamani Divorce Rumours: ప్రియమణి త్వరలోనే విడాకులు తీసుకోబోతుందా? క్లారిటీ ఇచ్చేసిందిగా!

Actress Priyamani Gave Clarity On Her Divorce With Mustafa Raj - Sakshi

ఇండస్ట్రీలో ఈమధ్యకాలంలో విడాకుల వార్తలు తరుచూ వినిపిస్తున్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు విడిపోవడం అభిమానులను ఆందోళనకు గురిచేస్తుంది. టాలీవుడ్‌లో చై-సామ్‌ల విడాకుల విషయం ఇప్పటికీ హాట్‌టాపిక్‌గానే ఉంది. తాజాగా మరో హీరోయిన్‌ ప్రియమణి తన భర్త ముస్తఫా రాజ్‌తో విడిపోతున్నట్లు కొంతకాలంగా వార్తలు షికార్లు చేస్తున్నాయి.

భర్తతో గొడవల కారణంగా కొంతకాలంగా వీరిద్దరూ వేర్వేరుగా ఉంటున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. త్వరలోనే  వీళ్లిద్దరు విడాకులు తీసుకోవాలని భావిస్తున్నట్టు మీడియా వర్గాల్లో వార్తలు వినిపించాయి. ఇప్పటికే ప్రియమణి టీం ఈ వార్తలను కొట్టిపారేసినా సోషల్‌ మీడియాలో ఆమె వ్యక్తిగత జీవితంపై రకరకాల కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని స్పష్టమవుతుంది.


రీసెంట్‌గా 'రాకెట్రీ' సినిమా సక్సెస్‌ మీట్‌ పార్టీకి కూడా ప్రియమణి తన భర్తతో కలిసి హాజరైంది. దీనికి సంబంధించిన వీడియోను కూడా సోషల్‌ మీడియాలో ప​ంచుకుంది. కాగా ప్రియమణి 2017లో ముస్తఫారాజ్ అనే వ్యాపార‌వేత్త‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.  

ముస్తాఫాకు ఇది రెండో పెళ్లి. ఇదివరకే అయేషా అనే మహిళతో అతడికి వివాహం జరిగింది. ఒకనొక సమయంలో ముస్తాఫాపై అయేషా ఆరోపణలు చేసినా ప్రియమణి ఆ సమయంలో భర్తకు అండగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఆమె ఇన్‌స్టా ఐడీ భర్త పేరుతో కలిపి.. ప్రియమణి రాజ్‌ అనే ఉంది. దీంతో ఇప్పటికైనా ఈ పుకార్లకి ఫుల్‌స్టాప్‌ పడుతుందేమో చూడాలి. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top