తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా కొత్త ఇంట్లో అడుగుపెట్టింది. ఇప్పటికే చనిపోయిన అమ్మ జ్ఞాపకార్థం.. ఈ ఇంటికి ఆమె పేరు పెట్టినట్లు చెబుతూ ఎమోషనల్ అయింది. కొత్త ఇంటికి సంబంధించిన ఫొటోలు, సత్యనారాయణ వృతం పూజా తాలూకూ ఫొటోలని పంచుకుంది.
(ఇదీ చదవండి: ఓటీటీలో 'ఆకలిరాజ్యం 2026' తెలుగు రివ్యూ)
'నాన్న పూర్తిగా తన మనసంతా పెట్టి ఈ ఇంటిని కట్టారు. ఆయన అమ్మని ఎంతలా మిస్ అవుతున్నారో నాకు తెలుసు. అందుకే ఇంటికి 'నాగేశ్వరి నిలయం' అని ఆమె పేరు పెట్టాం. ఎందుకంటే ఇలా అయితే అమ్మ ఎప్పుడు మాకు దగ్గరగా ఉన్నట్లే అనిపిస్తుంది' అని హీరోయిన్ ఈషా రెబ్బా ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.
ఈషా రెబ్బా కెరీర్ విషయానికొస్తే.. 2012లో రిలీజైన 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' మూవీలో చిన్న పాత్ర చేసి నటిగా పరిచయమైంది. తర్వాత అంతకు ముందు ఆ తర్వాత, బందిపోటు, అమీ తుమీ, దర్శకుడు, ఆ, బ్రాండ్ బాబు, అరవింద సమేత, సుబ్రమణ్యపురం, రాగల 24 గంటల్లో, మామ మశ్చీంద్ర తదితర మూవీస్ చేసింది. చివరగా ఈ ఏడాది జనవరిలో రిలీజైన 'ఓం శాంతి శాంతి శాంతి' చిత్రంలో కనిపించింది. ఓటీటీల్లో పలు వెబ్ సిరీస్లు కూడా ఈషా చేసింది.
(ఇదీ చదవండి: ఊపేస్తున్న 'ప్యారడైజ్' కొత్త పాట.. లిరికల్ వీడియో రిలీజ్)







