తెలుగులో 'మొగలిరేకులు' సీరియల్తో నటిగా పరిచయమై గుర్తింపు తెచ్చుకున్న శిరీష.. మళ్లీ పెళ్లి చేసుకుంది.
యాంకర్ కమ్ నటుడు మహేంద్రతో కొత్త జీవితం ప్రారంభించింది. ఈ శుభవార్తని సోషల్ మీడియాలో పంచుకుంది.
గత కొన్నిరోజుల నుంచి వీళ్ల వివాహం గురించి రూమర్స్ వచ్చాయి. ఇవి నిజమా కాదా అని అంతా అనుకునేలోపు వీళ్లిద్దరూ ఒక్కటై అందరికీ షాకిచ్చారు.
శిరీష అచ్చ తెలుగమ్మాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పుట్టిపెరిగిన ఈమెకు ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఉండగా వీరు కూడా సీరియల్స్లో చేశారు.
కానీ శిరీష అక్కలను మించి క్రేజ్ అందుకుంది. మొగలిరేకులు చేసిన తర్వాత రాములమ్మ, స్వాతి చినుకులు, మనసు మమత, చెల్లెలి కాపురం, కలవారి కోడలు కనకమహాలక్ష్మి, త్రిశూలం తదితర సీరియల్స్లోనూ నటించింది.
గతంలో ఈమె నవీన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోగా వీళ్లకు కొడుకు పుట్టాడు. కానీ రెండేళ్ల క్రితం అంటే 2024లో తన భర్త నుంచి విడిపోతున్నట్లు శిరీష ప్రకటించింది.
శిరీష పెళ్లి చేసుకున్న మహేంద్ర విషయానికొస్తే ఆర్జేగా కెరీర్ ప్రారంభించాడు. తర్వాత 'ఇంటింటి రామాయణం', 'మగువ ఓ మగువ' సీరియల్స్లో సహాయ పాత్రలు చేశాడు.
(Images Source : Instagram/rjmahionair)


