మరో అరుదైన ఘనత సాధించిన రిషబ్‌ శెట్టి | Rishab Shetty In Forbes India List Latest | Sakshi
Sakshi News home page

మరో అరుదైన ఘనత సాధించిన రిషబ్‌ శెట్టి

Aug 29 2026 2:36 PM | Updated on Aug 29 2026 2:47 PM

Rishab Shetty In Forbes India List Latest

సాక్షి బెంగళూరు: కన్నడ చిత్ర పరిశ్రమకు గర్వకారణమైన నటుడు, దర్శకుడు రిషబ్‌ శెట్టి ప్రపంచ స్థాయిలో మరో చారిత్రాత్మక ఘనత సాధించారు. ప్రతిష్టాత్మక ‘ఫోర్బ్స్‌ ఇండియా’ ప్రచురించిన దేశంలోని టాప్‌– 100 ప్రముఖుల జాబితాలో చోటు దక్కించుకున్నాడు.

మూడు రంగాల్లో ఏకైక విజేత  
రిషబ్‌ శెట్టి ఈ ఏడాది ఫోర్బ్స్‌ జాబితాలో ఒక ప్రత్యేక రికార్డుని సృష్టించాడు. నటుడు, దర్శకుడు, రచయిత అనే ఈ మూడు విభాగాల్లో ఏకకాలంలో ఎంపికైన దేశంలోని ఏకైక ప్రముఖుడిగా రిషబ్‌ నిలిచారు. ఈ ఘనతని ఇంతకుముందెన్నడూ ఏ భారతీయ చిత్ర పరిశ్రమ ప్రముఖుడూ సాధించలేదు.

బాక్సాఫీస్‌ వద్ద ‘కాంతార–1’ ఆధిపత్యం  
హొంబాళె ఫిలింస్ బ్యానర్‌పై నిర్మించిన కాంతార రెండు సినిమాలు.. ప్రపంచ వ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా వసూలు చేసి బాక్సాఫీస్‌ దగ్గర సరికొత్త రికార్డులు సృష్టించాయి. దీని ద్వారానే రిషన్ పాన్ ఇండియా స్టార్‌డమ్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ప్రశాంత్ వర్మతో కలిసి 'జై హనుమాన్', హిందీ దర్శకుడితో ఛత్రపతి శివాజీ బయోపిక్ మూవీలో నటిస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement