హీరో కార్తీక్‌కు కరోనా..టెన్షన్‌లో కియారా అద్వానీ | Actor Kartik Aaryan Teststed Positive For COVID-19 | Sakshi
Sakshi News home page

కరోనా వచ్చింది.. ప్రార్థించండి : బాలీవుడ్‌ హీరో

Mar 22 2021 6:58 PM | Updated on Mar 22 2021 7:10 PM

Actor Kartik Aaryan Teststed  Positive For COVID-19 - Sakshi

ముంబై : బాలీవుడ్‌ యువ హీరో కార్తీక్‌ ఆర్యన్‌కు కరోనా సోకింది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా ఆయనే స్వయంగా వెల్లడించారు. ప్లస్‌ సింబల్‌ను షేర్‌ చేస్తూ..తనకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని, త్వరగా కోలుకునేలా ప్రార్థించాలని కోరారు. దీనిపై పలువురు నెటిజన్లు స్పందిస్తూ..మీరు తప్పకుండా కోలుకుంటారు, భయపడకండి అంటూ కామెంట్లు చేశారు. అయితే ఆదివారం జరిగిన ల్యాక్మీ ఫ్యాషన్‌ వీక్‌లో హీరోయిన్‌ కియారా అద్వానీ, ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రాతో కలిసి హీరో కార్తీక్‌ ర్యాంప్‌ వాక్‌లో పాల్గొన్నాడు.


అంతేకాకుండా ఇటీవలె కియారా, టబులతో కలిసి భూల్ భులైయా 2 అనే సినిమా షూటింగ్‌లోనూ పాల్గొన్నాడు. దీంతో ఇప్పడు వీరిందరికి కరోనా భయం పట్టుకుంది. గత కొన్ని రోజులుగా తనను కంటాక్ట్‌ అయిన వారిలో లక్షణాలు కనిపిస్తే వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని కార్తీక్‌ తెలిపారు. చివరగా ఆయన ఇంతియాజ్ అలీ లవ్ ఆజ్ కల్ లో కనిపించారు. గత కొంతకాలంగా దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తీవ్రమవుతున్న సంగతి తెలిసిందే.  

చదవండి : బిగ్‌బాస్‌ భామకు కరోనా పాజిటివ్
ప్రముఖ కమెడియన్‌ తేపట్టి గణేశన్ మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement