-
థ్యాంక్స్ టూ మనీష్ మల్హోత్రా.. సమ్మర్ 2024 స్పెషల్ డిజైన్స్ (ఫొటోలు)
-
ఎయిర్ ఇండియా ఉద్యోగులకు కొత్త యూనిఫాం
న్యూఢిల్లీ: విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా సిబ్బందికి త్వరలో కొత్త యూనిఫాం రానుంది. ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఈ యూనిఫామ్స్ను డిజైన్ చేయనున్నారు. 10,000లకుపైగా ఉన్న ఫ్లయిట్ క్రూ, గ్రౌండ్ స్టాఫ్, సెక్యూరిటీ ఉద్యోగులు 2023 చివరినాటికి నూతన డ్రెస్లో దర్శనమీయనున్నారు. ఎయిర్ ఇండియాలో కొనసాగుతున్న ఆధునీకరణ కార్యక్రమంలో భాగంగా ఇది మరో అడుగు అని సంస్థ తెలిపింది. -
పరిణీతి- రాఘవ్ పెళ్లి.. అందుకోసం 2500 గంటలు పట్టిందా??
బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఆదివారం ఉదయ్పూర్లోని లీలా ప్యాలెస్లో ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాను పరిణయమాడింది. ఈ వివాహానికి సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు కూడా పెద్దఎత్తున హాజరయ్యారు. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సైతం సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ జంట వెడ్డింగ్ దుస్తుల్లో దిగిన ఫోటోలు తెగ వైరలవుతున్నాయి. ఇవీ అభిమానులు సైతం నూతన జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. (ఇది చదవండి: నాకెలాంటి సంబంధం లేదు.. పైశాచిక ఆనందం కోసమే: టాలీవుడ్ హీరోయిన్) పరిణీతి లెహంగాపై చర్చ ఇదిలా ఉంటే పెళ్లిలో పరిణీతి చోప్రా ధరించిన డ్రెస్పైనే నెట్టింట చర్చ మొదలైంది. వధువుగా హీరోయిన్ ధరించిన లెహంగా డిజైన్ ప్రత్యేకంగా కనిపించడంతో అందరి దృష్టి దానిమీదే పడింది. అయితే వీరి పెళ్లికి దుస్తులను ప్రముఖ డిజైనర్ మనీశ్ మల్హోత్రా సిద్ధం చేశారు. వారి కోసం ప్రత్యేకంగా రూపొందించిన డ్రెస్సుల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. పరిణీతి ధరించిన లెహంగా ప్రత్యేకతలను ఆయన వివరించారు. పరిణీతి కోసం లెహంగా రూపొందించడానికి దాదాపు 2,500 గంటల సమయం పట్టిందని మనీష్ మల్హోత్రా తెలిపారు. ఇది పూర్తిగా హ్యాండ్ ఎంబ్రాయిడరీతో చేసినట్లు వెల్లడించారు. ఈ అందమైన లెహంగాను పాతకాలపు బంగారు దారంతో రూపొందించామన్నారు. అతిథులను మంత్రముగ్దులను సున్నితమైన మెష్, దుపట్టా, ముత్యాలు, ప్రతి ఒక్కటి ఫెయిర్తో అలంకరించామని డిజైనర్ మనీశ్ పేర్కొన్నారు. అంతే కాకుండా పరిణీతి డ్రెస్పై రాఘవ్ పేరు ముద్రించినట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by @parineetichopra -
Meena Kumari biopic: విషాద నటి బయోపిక్ నిజమే
హిందీ చిత్రసీమలో విషాద పాత్రల్లో మెప్పించిన అలనాటి నటి ఎవరు అంటే? ‘మీనా కుమారి’ పేరు చెబుతారు. తన అందం, అభినయంతో నాటి తరం ప్రేక్షకులను అలరించారు మీనా కుమారి. ప్రస్తుతం ఆమె బయోపిక్ రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. బాలీవుడ్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారని వార్తలు వచ్చాయి. తాజాగా, ఈ బయోపిక్ గురించి మనీషా మల్హోత్రా మాట్లాడుతూ– ‘‘ఏ చిత్రానికైనా కథే కీలకం. బయోపిక్లకి మరీను. మీనా కుమారి మీద వచ్చిన పుస్తకాల ఆధారంగా కథ తయారు చేస్తున్నా’’ అన్నారు. ఇటీవల రిలీజైన∙‘ఆది పురుష్’లో సీత పాత్ర చేసిన కృతీ సనన్ ‘మీనా కుమారి’ బయోపిక్లో టైటిల్ రోల్ చేయనున్నారు. ఇదిలా ఉంటే.. మీనా కుమారి బయోపిక్ తీయడానికి ఆమె కుటుంబ సభ్యులు సుముఖంగా లేరని భోగట్టా. -
తారల మెరుపులతో మనీష్ మల్హోత్రా ఈవెంట్ (ఫొటోలు)
-
కియారా వేసుకున్న ఈ డ్రెస్ డిజైన్ చేయడానికి అన్ని వారాలు పట్టిందా?
బాలీవుడ్ లవ్బర్డ్స్ కియారా అద్వానీ-సిద్ధార్థ్ మల్హొత్ర ఇటీవలె పెళ్లిపీటలు ఎక్కిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 7వ తేదీన రాజస్థాన్ జైసల్మేర్లో కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో సిద్-కియారాల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఇక రీసెంట్గా పెళ్లి, మెహందీ, సంగీత్.. ఇలా ఒక్కో వేడుకకు సంబంధించిన ఫోటోలను కియారా ఇన్స్టాగ్రామ్లో షేర్చేస్తుంది. తాజాగా సంగీత్ వేడుకలో సిద్ధార్థ్తో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ.. ఆ రాత్రి గురించి ఏం చెప్పాలి.. సమ్థింగ్ రియల్లీ స్పెషల్’ అంటూ రాసుకొచ్చింది. ఈ క్రమంలో కియారా అవుట్ఫిట్ టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. కంప్లీట్ గోల్డ్ అండ్ సిల్వర్ రంగులో ఉన్న ఈ లెహంగాకు 98,000కు పైగా క్రిస్టల్స్తో ప్రత్యేకంగా డిజైన్ చేశారు. సుమారు 4,000 గంటలు (దాదాపు 24 వారాలు)కష్టపడి ఈ లెహంగాను తీర్చిదిద్దారు మనీష్ మల్హోత్రా అండ్ టీం.ప్రస్తుతం కియారా సంగీత్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. -
Fashion: రమ్యకృష్ణ ధరించిన ఈ చీర ధర తెలిస్తే షాకవ్వాల్సిందే!
ఫలానా పాత్ర కోసం ఆమె’ అనే అవకాశాన్ని అందుకునే స్థాయి దాటిపోయి.. ‘ఆమె కోసం ఈ పాత్ర’ అని రచయితలు రాసే.. దర్శకులు ఆలోచించే హోదాకు చేరుకున్న నటి రమ్యకృష్ణ! ఆమెకు సంబంధించిన ఈ ప్రత్యేకత ష్యాషన్ రంగంలోనూ అమలవుతోంది. ఇక్కడ చెబుతున్నది చిన్న ఉదాహరణ మాత్రమే! మనీష్ మల్హోత్రా డిజైనర్ మనీష్ మల్హోత్రా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలీవుడ్ టాప్ హీరోయిన్స్తో పాటు పలువురు సెలబ్రిటీలకూ దుస్తులు డిజైన్ చేస్తుంటాడాయన. బాలీవుడ్లో ఏ ఈవెంట్ జరిగినా మనీష్ మల్హోత్రా కాస్ట్యూమ్స్ ఉండాల్సిందే. ఫ్యాషన్ వరల్డ్కి బ్రాండ్ అంబాసిడర్గా మారిన ఈ డిజైనర్ బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్గా ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ ప్రూవ్ చేసుకున్నాడు. ఫిల్మ్ఫేర్తో పాటు మరెన్నో అవార్డులనూ అందుకున్నాడు. అయితే అతని డిజైన్స్ను సామాన్యుడు అందుకోవాలంటే కాస్త కష్టమే. ఏది కొనాలన్నా ధర లక్షల్లోనే ఉంటుంది. ఆన్లైన్లో లభ్యం. జైపూర్ జెమ్స్.. 1974, ముంబైలో శ్రీపాదం సచేతి ప్రారంభించిన బంగారు ఆభరణాల వ్యాపారమే ఈ ‘జైపూర్ జెమ్స్’. అప్పట్లోనే కస్టమర్ కోరుకున్న డిజైన్స్లో ఆభరణాలను తయారుచేసి ఇచ్చేవారు. ఇలా వారికంటూ ఒక ప్రత్యేకత ఉండటంతో నలభై ఎనిమిదేళ్లుగా వారి వ్యాపారం జోరుగానే సాగుతోంది. ప్రస్తుతం చెన్నై, కోయంబత్తూర్లలోనూ జైపూర్ జెమ్స్కి స్టోర్స్ ఉన్నాయి. ఆన్లైన్లోనూ కొనుగోలు చేసే వీలుంది. బ్రాండ్ వాల్యూ చీర బ్రాండ్: మనీష్ మల్హోత్రా ధర: రూ. 2,75,000 జ్యూయెలరీ బ్రాండ్: జైపూర్ జెమ్స్ ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. నాకు డ్రీమ్రోల్స్ అంటూ ఏవీ లేవు. నాకొచ్చిన, వస్తున్నవన్నీ నేను కోరుకున్న పాత్రలే. కాబట్టి వాటినే నా డ్రీమ్రోల్స్ అనుకోవచ్చు! – రమ్యకృష్ణ ∙దీపిక కొండి View this post on Instagram A post shared by Ramya Krishnan (@meramyakrishnan) -
ఖరీదైన ఇల్లు కొన్న ప్రముఖ డిజైనర్, ధర ఎంతంటే..
Manish Malhotra Buys 21 Crore Worth Appartment In Mumbai Bandra: ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ మనీష్ మల్హొత్రా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలీవుడ్ టాప్ హీరోయినర్స్ సహా పలువురు సెలబ్రిటీలకు అదిరిపోయే దుస్తులు డిజైన్ చేస్తుంటారాయన. బీటౌన్లో ఏ ఈవెంట్ జరిగినా మనీష్ మల్హొత్రా కాస్ట్యూమ్స్ ఉండాల్సిందే అనేంతలా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. బీటౌన్ ఫ్యాషన్ కలల ప్రపంచానికి బ్రాండ్ అంబాసిడర్గా మారిన ఈ కాస్ట్యూమ్ డిజైనర్కి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు బీటౌన్లో హాట్టాపిక్గా మారింది. ముంబైలో భారీ మొత్తానికి మనీష్ మల్హొత్ర ఓ అపార్ట్మెంట్ కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. బాంద్రా వెస్ట్లోని భోజ్వనీ ఎన్క్లేవ్లో సుమారు రూ. 21 కోట్లు పెట్టి కాస్ట్లీ అపార్ట్మెంట్ను కొనుగోలు చేసినట్లు బీటౌన్ వర్గాల సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పనులు కూడా పూర్తయినట్లు తెలుస్తుంది. -
ఎంఎం స్టయిల్స్లో రిలయన్స్కు 40% వాటాలు
న్యూఢిల్లీ: ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రాకు చెందిన ఎంఎం స్టయిల్స్లో రిలయన్స్ బ్రాండ్స్ (ఆర్బీఎల్) 40 శాతం వాటాలు కొనుగోలు చేయనుంది. ఇరు సంస్థ లు ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపాయి. ‘ఎంఎం స్టయిల్స్లో 40 శాతం మైనారిటీ వాటా కోసం బ్రాండ్ వ్యవస్థాపకుడు, క్రియేటివ్ డైరెక్టర్ మనీష్ మల్హోత్రాతో ఆర్బీఎల్ ఒప్పందం కుదుర్చుకుంది’ అని పేర్కొన్నాయి. అయితే, డీల్ విలువ ఎంతనేది మాత్రం వెల్లడించలేదు. ఇప్పటిదాకా మనీష్ మల్హోత్రా ప్రైవేట్గా నిర్వహిస్తున్న ఈ బ్రాండ్లో బైటి ఇన్వెస్టర్ పెట్టుబడి పెట్టడం ఇదే తొలిసారి. భారతీయ కళలు, సంస్కృతిపై అపార గౌరవమే మల్హోత్రాతో వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకోవడానికి కారణమని పారిశ్రామిక దిగ్గజం ముఖేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ రిటైల్ వెంచర్స్ పేర్కొంది. అంతర్జాతీయంగా విస్తరించే క్రమంలో రిలయన్స్తో భాగస్వా మ్యం గణనీయంగా తోడ్పడగలదని మల్హోత్రా తెలిపారు. 2005లో ప్రారంభమైన ఎంఎం స్టయిల్స్ బ్రాండ్కు హైదరాబాద్ సహా ముంబై, న్యూఢిల్లీ నగరాల్లో 4 పెద్ద స్టోర్స్ ఉన్నాయి. -
మనీశ్ మల్హోత్రాతో రిలయన్స్ భారీ డీల్
Reliance Buys Manish Malhotra Stakes: వస్త్ర ప్రపంచంలో తన బ్రాండ్తో దూసుకుపోతున్న ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ బ్రాండ్స్ లిమిటెడ్.. భారీ ఒప్పందం దిశగా అడుగులు వేసింది. ప్రముఖ డిజైనర్ లేబుల్ ‘మనీశ్ మల్హోత్రా’లో 40 శాతం వాటా చేజిక్కించుకోబోతోంది. పదహారేళ్లుగా దేశం నుంచి ప్రపంచవ్యాప్తంగా పేరు విస్తరించుకున్న మనీశ్ మల్హోత్రా బ్రాండ్లో రిలయన్స్ మెజార్టీ వాటా కొనుగోలు చేయనుంది. మనీశ్ మల్హోత్రా బయటి కంపెనీతో ఒప్పందం చేసుకోవడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ మేరకు మనీశ్తో ఒప్పందాన్ని గౌరవంగా భావిస్తున్నామని రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ డైరెక్టర్ ఇషా అంబానీ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇక ఇప్పటికే ఢిల్లీ, హైదరాబాద్ లాంటి ప్రముఖ నగరాల్లో స్టోర్లను నడిపిస్తున్న మనీశ్ మల్హోత్రా.. దేశంలోనే మొదటి వర్చువల్ స్టోర్ తెరిచిన ఫీట్ సైతం సాధించారు. ‘భారత సంప్రదాయాల్ని ప్రతిబింబించేలా దుస్తుల్ని రూపొందించడం ఈ లేబుల్ ప్రత్యేకత. రియలన్స్తో ఒప్పందం ద్వారా దేశ, విదేశాలకు సేవలను విస్తరిస్తామ’ని ఈ సందర్భంగా మనీశ్ మల్హోత్రా(54) తెలిపారు. చదవండి: 14 ఏళ్లుగా ఆ జాబితాలో అగ్రస్థానంలో ముఖేష్ అంబానీ -
చీరకట్టులో కుందనపు బొమ్మలా ‘పీవీ సింధు’
PV Sindhu In Saree: భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి మన తెలుగమ్మాయి పీవీ సింధు పూల రంగు చీర కట్టుకుని కుందనపు బొమ్మలా మెరిసింది. చీరకట్టులతో తెలుగమ్మాయిలా కనిపిస్తూ ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన ఫొటోలను ఆమె తన ఇన్స్టాగ్రామ్లో పంచుకుంది. చిరునవ్వు చిందిస్తూ చీరలో మెరిసిపోతున్న సింధును చూసిన అభిమానులు, నెటిజన్లు తెగ లైక్లు కొట్టేస్తున్నారు. ఆ ఫొటోలకు ఏడు లక్షల మందికిపైగా లైక్స్ కొట్టారు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీశ్ మల్హోత్రా రూపొందించిన చీరలో సింధు కనిపించింది. ఎప్పుడూ క్రీడా దుస్తుల్లో కనిపించే సింధు ఇప్పుడు సంప్రదాయ దుస్తుల్లో దేవకన్యలా ప్రత్యక్షమైంది. తెలుపు చీరలో గులాబీ, నీలం, పర్పుల్ పూలు త్రెడ్వర్క్ చేసి ఉంది. ఈ చీర విలువ దాదాపు కొన్ని వేలల్లో ఉంటుందని ఫ్యాషన్ప్రియులు చెబుతున్నారు. చదవండి: అచ్చం సినిమాలా? వ్యాపారి కుమారుడు కిడ్నాప్.. సింధుకు ఇన్స్టాగ్రామ్లో 2.6 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. కాగా పీవీ సింధు ఇటీవల జరిగిన టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే. వరుసగా రెండు ఒలింపిక్స్లో పతకం సాధించి సింధు సత్తా చాటింది. ఢిల్లీలో జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో సింధు పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సింధు ఐస్క్రీమ్ తిన్న విషయం తెలిసిందే. చదవండి: సీఎంపై అనుచిత వ్యాఖ్యలు.. కేంద్ర మంత్రి నారాయణ రాణె అరెస్ట్ View this post on Instagram A post shared by Sindhu Pv (@pvsindhu1) -
హల్చల్ : రకుల్ చీటింగ్..పూజా కిస్సింగ్..హ్యాపీ అంటున్న సదా
♦ చీటింగ్ చేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ ♦ తల్లితో బర్త్డే సెలబ్రేషన్స్లో మునిగిన సుప్రీత ♦ ముద్దులొలుకుతున్న పొడుగుకాళ్ల సుందరి పూజాహెగ్డే ♦ మహేశ్కు బర్త్డే విషెస్ తెలిపిన నమ్రత ♦ పుస్తకాల ఇంపార్టెన్స్ చెబుతున్న సోనాలీ బింద్రె ♦ వీకెండ్ కోసం ఎదురుచూస్తున్న మనీష్ మల్హొత్ర ♦ బ్లాక్ సల్వార్లో కృష్ణ ముఖర్జి క్యూట్ లుక్స్ ♦ ఎవరో గెస్ చేయమంటున్న దీపిక పిల్లి ♦ వర్కవుట్కు రెడీ అయిన కత్రినా కైఫ్ ♦ బీ హ్యాపీ అంటున్న సదా ♦ మీరు కూడా ఇంతేనా అని ప్రశ్నిస్తున్న అభిజీత్ View this post on Instagram A post shared by ANSHUKA | Yoga & Wellness (@anshukayoga) View this post on Instagram A post shared by Abijeet (@abijeet11) View this post on Instagram A post shared by Krishna Mukherjee (@krishna_mukherjee786) View this post on Instagram A post shared by Deepika Pilli (@deepika_pilli) View this post on Instagram A post shared by Katrina Kaif (@katrinakaif) View this post on Instagram A post shared by Sonali Bendre (@iamsonalibendre) View this post on Instagram A post shared by Manish Malhotra (@manishmalhotra05) View this post on Instagram A post shared by BANDARU SUPRITHA NAIDU✨ (@_supritha_9) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by SitaraGhattamaneni (@sitaraghattamaneni) View this post on Instagram A post shared by Sadaa (@sadaa17) \ \ View this post on Instagram A post shared by Ashmita karnani (@ashmita_9) -
Virtual Fashion Week: వర్చువల్ ఎంపిక
కరోనా కారణంగా ఆన్లైన్ షాపింగ్ పెరిగినప్పటికీ నిశితంగా పరిశీలిస్తే మొత్తం లగ్జరీ ఫ్యాషన్ అమ్మకాలు 8 నుండి 10 శాతం మాత్రమే ఉందని నిపుణుల అంచనా. ఫలితంగా ప్రఖ్యాత డిజైనర్లు సైతం వర్చువల్కి మారారు. ర్యాంప్వాక్లతో ధగధగలాడే ఫ్యాషన్ షోలు సైతం వర్చువల్ దారిలోకి వచ్చేశాయి. అటు నుంచి టైలరింగ్, డిజైనింగ్లో శిక్షణ కూడా డిజిటల్లో వెలుగుతోంది. ఇప్పటికే ప్రఖ్యాత డిజైనర్లు మనీష్ మల్హోత్రా, రితుకుమార్, రీనా ఢాకా, బినా రమణి, సమంతా చౌహాన్,.. వంటి వారెందరో వర్చవల్ వేదికకు రంగం సిద్ధం చేసుకున్నారు. విదేశాలలో ఊపందుకున్న వర్చువల్ రియాలిటీ ఇప్పుడు దేశీయంగానూ ఫ్యాషన్ రంగంపై తన ప్రభావాన్ని చూపుతోంది. ఫ్యాషన్ షోలు ఫ్యాషన్ షో అనగానే జిగేల్మనే లైట్లు, మోడళ్ల మెరుపులు, ర్యాంప్వాక్లు, ఆహుతుల చప్పట్ల హోరు గ్రాండ్గా కళ్ల ముందు నిలుస్తుంది. మహమ్మారి కారణంగా ర్యాంప్ వేదికలు వర్చువల్గా మారాయి. ర్యాంప్లను గ్రీన్ స్క్రీన్లతో రియల్ టైమ్ కంపోజిషన్స్ భర్తీ చేశారు. ఇప్పుడు ఎవ్వరైనా తమ గదిలో కూర్చునే డిజిటల్లో ఈ ర్యాంప్ షోలను వీక్షించవచ్చు. ఇండియా కొచర్ వీక్, బ్లెండర్స్ ఫ్యాషన్ ప్రైడ్, ఇటీవల జరిగిన లాక్మే ఫ్యాషన్ షో కూడా వర్చువల్లోనే నడిచింది. ఇవన్నీ దేశ విదేశాల నుండి ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసేవే. వర్చువల్లో లో దుస్తులు, ఇతర సౌందర్య సాధనాలు, మేకప్ లుక్స్ కూడా ప్రదర్శించడం, వాటిని కోట్లాదిమంది వీక్షించడం ప్రస్తుత ట్రెండ్కు నిదర్శనంగా ఉంది. షాపింగ్ లగ్జరీ డిజైన్స్ సృష్టించే డిజైనర్లు్ల కేవలం ఆన్లైన్ అమ్మకాల ద్వారా ప్రయోజనం పొందలేమని గుర్తించారు. కస్టమర్లు నేరుగా షాప్ను సందర్శించి, డిజైన్లు చూసే అనుభూతిని పొందుతారని, అప్పుడే వారు ఆర్డర్లు ఇవ్వడానికి, కొనుగోలు చేయడానికి ఇష్టపడతారని గ్రహించారు. కోవిడ్ కారణంగా ప్రస్తుతం వినియోగదారుడిని నేరుగా షాప్కి రప్పించలేని పరిస్థితి. ఫలితంగానే భారతీయ ఫ్యాషన్ పరిశ్రమ కొనుగోలు విధానంలో వర్చువల్ మార్పు బాణంలా దూసుకొచ్చింది. ఇండియాలో మొదటిసారి పూర్తి వర్చువల్ స్టోర్ను మనీష్ మల్హోత్రా ప్రారంభించాడు. ఆ తర్వాత అదే దారిలో ప్రఖ్యాత డిజైనర్లు ప్రయాణిస్తున్నారు. గ్రాండ్గా డిజైన్ చేసే బ్రైడల్ దుస్తుల డిజైనర్లు ఇదే కోవలో పయనిస్తున్నారు. యువతరాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తున్న ఈ ప్రయోగం సక్సెస్బాటలో నడుస్తోందన్నది డిజైనర్ల అభిప్రాయం. డిజైనింగ్ క్లాసులు టైలరింగ్కు వర్చువల్ క్లాసులు తలుపులు తెరిచాయి. సాధారణ స్థానిక టైలరింగ్ నుంచి ప్రసిద్ధ డిజైనర్ల వరకు ఆన్లైన్ వేదికగా క్లాసులు తీసుకుంటున్నారు. ఫ్యాషన్ అకాడమీలు కూడా ఇదే బాట పట్టాయి. విద్యార్థులకు ఇచ్చే క్లాసులన్నీ ఆన్లైన్ వేదిక అయినట్టుగానే ఫ్యాషన్ క్లాసులూ డిజిటల్ అయ్యాయి. డ్రెస్ డిజైన్స్, ఇలస్ట్రేషన్లు, ఎంబ్రాయిడరీ, కటింగ్ పద్ధతులు.. వంటివి వర్చువల్ క్లాసులు జరుగుతున్నాయి. వీటికి డిజైనర్ను బట్టి కొంత మొత్తం చెల్లించి, అటెండ్ అవ్వచ్చు. ఒక రోజు నుంచి మొదలయ్యే ఆన్లైన్ వర్క్షాప్స్కి అటెండ్ అయ్యి డిజిటల్లోనే నేర్చుకోవచ్చు. ఆసక్తిగా డిజైనింగ్ ప్రస్తుత కాలం ఫ్యాషన్ షోలు, షాపింగ్ కొంతవరకు సరైనదే. అయితే, సాధారణంగా మనం ఫ్యాబ్రిక్ని టచ్ చేస్తే ఉండే ఫీల్ డిజిటల్లో చూస్తే రాదు. డిజిటల్లో ఫ్యాబ్రిక్ టెక్స్చర్ తెలుసుకోవడమూ కష్టమే. కాకపోతే డిజిటల్లో క్లాసులు తీసుకుంటున్నప్పుడు అవతలి వ్యక్తి అటెన్షన్ ఏ విధంగా ఉందనే విషయం అంతగా తెలియడం లేదు. అవతలి వ్యక్తి మనం చెప్పే విషయం పట్ల ఎంతసేపు అటెన్షన్ పెట్టగలుగుతున్నారనేది ముఖ్యం. క్లాస్ చెబుతున్నప్పటికీ వర్చువల్గా కమ్యూనికేషన్ అంతగా జరగడం లేదు. అందుకే, డిజిటల్లో క్లాస్ తీసుకునేప్పుడు సదరు వ్యక్తి తక్కువ టైమ్ కేటాయించి ఆ ప్రోగ్రామ్ డిజైన్ చేసుకోవాలి. క్లాస్ బోర్ ఉండకూడదు. నేర్చుకునేవాళ్లు కూడా వాళ్లకు వచ్చిన సందేహాలు అడుగుతూ ఉండాలి. రొటీన్గా చెబుతూ పోతే ఇటు మాస్టర్కి, అటు విద్యార్థికీ ఆసక్తి ఉండదు. – అరవింద్ జాషువా, ఫ్యాషన్ డిజైనర్ -
హీరో కార్తీక్కు కరోనా..టెన్షన్లో కియారా అద్వానీ
ముంబై : బాలీవుడ్ యువ హీరో కార్తీక్ ఆర్యన్కు కరోనా సోకింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఆయనే స్వయంగా వెల్లడించారు. ప్లస్ సింబల్ను షేర్ చేస్తూ..తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని, త్వరగా కోలుకునేలా ప్రార్థించాలని కోరారు. దీనిపై పలువురు నెటిజన్లు స్పందిస్తూ..మీరు తప్పకుండా కోలుకుంటారు, భయపడకండి అంటూ కామెంట్లు చేశారు. అయితే ఆదివారం జరిగిన ల్యాక్మీ ఫ్యాషన్ వీక్లో హీరోయిన్ కియారా అద్వానీ, ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రాతో కలిసి హీరో కార్తీక్ ర్యాంప్ వాక్లో పాల్గొన్నాడు. అంతేకాకుండా ఇటీవలె కియారా, టబులతో కలిసి భూల్ భులైయా 2 అనే సినిమా షూటింగ్లోనూ పాల్గొన్నాడు. దీంతో ఇప్పడు వీరిందరికి కరోనా భయం పట్టుకుంది. గత కొన్ని రోజులుగా తనను కంటాక్ట్ అయిన వారిలో లక్షణాలు కనిపిస్తే వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని కార్తీక్ తెలిపారు. చివరగా ఆయన ఇంతియాజ్ అలీ లవ్ ఆజ్ కల్ లో కనిపించారు. గత కొంతకాలంగా దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తీవ్రమవుతున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by KARTIK AARYAN (@kartikaaryan) చదవండి : బిగ్బాస్ భామకు కరోనా పాజిటివ్ ప్రముఖ కమెడియన్ తేపట్టి గణేశన్ మృతి -
ఒక్క క్లిక్తో పెళ్లి కుమార్తెలా మెరవవచ్చు..
ఇంటి నుంచే ఆన్లైన్ షాపింగ్ అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఇంట్లో ఉండే నేరుగా షాపును సందర్శించవచ్చు. అందులో తమకు నచ్చిన వాటిని ఎంపిక చేసుకోవచ్చు. ఆ డ్రెస్లో తాము ఎలా ఉంటామో చూసుకోవచ్చు. అదే వర్చువల్ రియాలిటీ. మన దేశీయ ప్రసిద్ధ డిజైనర్ మనీష్ మల్హోత్రా భారతదేశంలో మొదటి వర్చువల్ డిజైనర్ స్టోర్ను ఇటీవల ప్రారంభించాడు. కరోనా తర్వాత ఫ్యాషన్ ఇండస్ట్రీలో వచ్చిన మార్పుల్లో అతి ముఖ్యమైనదిగా వర్చువల్ రియాలిటీని చెప్పుకోవచ్చు. మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన పెళ్లి డ్రెస్సులను ధరించాలని, బాలీవుడ్ తరహా పెళ్లి నృత్యాలు చేయాలని చాలామంది అనుకుంటారు. అలా ఆలోచిస్తే.. ఈ దుకాణాన్ని మీరు ఒక్క క్లిక్తో తెరవచ్చు. ఆకట్టుకునే పంజాబీ పాట ‘మహే డి తప్పే’ కి దాని (వర్చువల్) తలుపులు తెరుస్తుంది. మీరు ఇక్కడ నుంచి ఒక గది నుండి మరొక గదికి వెళ్ళినప్పుడు సంగీతం మారుతుంటుంది. ఈ వర్చువల్ స్టోర్లో పర్యటించి మీరు ఆ స్టోర్లో పెళ్లి కూతురులా మెరిసిపోవచ్చు. షేర్వానీల వరసలు.. కంప్యూటర్ మౌస్ క్లిక్ చేస్తూ వెళుతుంటే .. మిమ్మల్ని లేలేత రంగుల డిజైనర్ లెహెంగాలు, షెర్వానీల వరుసల నుండి పోల్కీ ఆభరణాలతో మెరిసే ప్రదర్శనకు తీసుకెళుతుంది. మీ కంప్యూటర్ తెరపై కనిపించే ప్రతి డ్రెస్పై క్లిక్ చేయవచ్చు, ఫాబ్రిక్, ఎంబ్రాయిడరీ, ధరల గురించి చాలా వివరంగా తెలుసుకోవచ్చు. ఢిల్లీలోని మల్హోత్రా డిజైన్ స్టోర్కి ఇది వర్చువల్ అవతార్. దిగ్గజ కుతుబ్ మినార్కు ఎదురుగా ఉంది. ‘ఇది భారతదేశంలో నా మొదటి వర్చువల్ స్టోర్. 2019 లో ఈ స్టోర్ను రీ డిజైనింగ్ చేశాం. దీని విస్తీర్ణం 15,000 చదరపు అడుగులు. దేశంలో డిజైనర్ విభాగంలో అతిపెద్ద స్టోర్ ఇది‘ అని మల్హోత్రా చెప్పారు. లాక్డౌన్ నేర్పిన వేగం దేశంలో కరోనా కారణంగా ఏర్పడిన పరిస్థితులు ఈ వర్చువల్ ప్రక్రియను వేగవంతం చేసింది అంటాడు మల్హోత్ర. ‘ఈ వర్చువల్ స్టోర్ అంతటా ఉన్నట్టే. ఎప్పుడైనా, ఎక్కడైనా అన్ని రోజులు, అన్ని సమయాల్లో పనిచేస్తుంది. మేం ఈ ప్రదేశంలో లేకపోయినా మా డిజైన్లు కస్టమర్లను చేరుకుంటాయి. ఈ కొత్త విధానం ద్వారా మేం వినియోగదారుల నుంచి మంచి బలమైన నమ్మకాన్ని పొందగలం‘ అని తన వర్చువల్ విధానం గురించి తెలియజేస్తారు మల్హోత్రా. లాక్డౌన్ సమయంలో వినియోగదారుల నుంచి ఫోన్ కాల్స్ అందుకున్న మల్హోత్రా తనను నేరుగా కలవడానికి, వారి దుస్తులను చూడాలనుకునే వధువులకు ఉపయోగంగా ఉండే మాధ్యమాన్ని వెతికారు. అప్పుడే ఈ డిజిటల్ వైపు మొగ్గుచూపారు. వర్చువల్ ఉపయోగాలను వివరిస్తూ ‘నేను ఆర్డర్ల కోసం, నా కొత్త డిజైన్స్ పరిచయం చేయడానికి వేరే వేరే ప్రాంతాలు తిరగనక్కరలేదు. ఇది వినియోగదారులకు అంతర్జాతీయ మార్కెట్లలో ఉన్న అనుభవాన్ని అందిస్తుంది. దీని నుంచి మిడిల్ ఈస్ట్, కెనడా, అమెరికా వంటి దేశాలలో మా ఉనికిని బలోపేతం చేయాలని నేను ఆశిస్తున్నాను’ అని ఆయన చెప్పారు. మొత్తంమీద కరోనా వైరస్ కొత్త కొత్త వాటిని పరిచయం చేసింది. అందరి దృష్టి డిజిటల్ వైపు మరింత సారించేలా చేసింది. ఇప్పటికే ఫ్యాషన్ షోలు వర్చువల్ వైపుగా మళ్లాయి. ఇప్పుడు ఆ జాబితాలో స్టోర్స్ కూడా చేరాయి. -
నన్ను నా భర్తను లక్ష్యంగా చేసుకుని..
ముంబై: తనను, తన భర్తను ట్రోలర్స్ టార్గెట్ చేస్తున్నారని నటి ఊర్మిళ మటోండ్కర్ పేర్కొన్నారు. ఇటీవల ఊర్మిళ శివసేన పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి తనను, తన భర్త మొహిసన్ అక్తర్, ఇతర కుటుంబ సభ్యలపై ట్రోలర్స్ సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆమె చెప్పారు. తన భర్త మొహిసిన్ను పాకిస్తానీ అని ఆయన ఓ టెర్రరిస్ట్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దేనికైనా ఓ హద్దు ఉంటుందని, అవి మితిమీరితే సహించేది లేదని ట్రోలర్స్పై మండిపడ్డారు. అయితే తన భర్త పాకిస్తాన్ ముస్లిమని, ఆయన ముస్లిం కావడమే ట్రోల్స్కు ప్రధాన కారణమన్నారు. అదే విధంగా ఇటీవల తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను కూడా హ్యాక్ చేశారని చెప్పారు. అప్పటి నుంచి తనను, తన భర్త మొహిసిన్ లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారని ఆరోపించారు. ఇక గతంలో కూడా తన వికీపీడియా వివరాలను తప్పుగా పేర్కొన్నారని చెప్పారు. ఇందులో తన తండ్రి పేరును శివీందర్ సింగ్ అని, తల్లి పేరును రుక్సానా అహ్మద్గా మార్చారని తెలిపారు. కానీ తన తల్లిదండ్రుల పేర్లు సునీతా, శ్రీకాంత్ మటోండ్కర్ అని ఊర్మిళ స్పష్టం చేశారు. కాగా ఊర్మిళ-మొహిసిన్లు 2016లో సీక్రెట్గా ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి వివాహానికి డిజైనర్ మనీష్ మల్హోత్రా మాత్రమే ప్రముఖ అతిథిగా హాజరయ్యారు. -
మనీష్ మల్హోత్రాకు బీఎంసీ నోటీసులు
ముంబై: బాద్రాలోన కంగనా రనౌత్ కార్యాలయాన్ని నిన్న బృహన్ ముంబై కార్పోరేషన్(బీఎంసీ) అక్రమ నిర్మాణంగా పేర్కొంటూ కూల్చివేసిన విషయం తెలిసిందే. తాజాగా ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనిష్ మల్హోత్రాకు బీఎంసీ సివిక్ బాడీ నోటీసులు ఇచ్చింది. అక్రమ నిర్మాణం, ఇతర నిబంధనలు ఉల్లఘించినందుకు గాను బీఎంసీ గురువారం నోటిసులు జారీ చేసింది. కంగనా పాలి హిల్స్ కార్యాలయం పక్కనే మనీష్ భవనం కూడా ఉంది. సెక్షన్ 351 కింది బీఎంసీ ఈ నోటిసులు జారీ చేసింది. ఇందులో ముంబై మున్పిపల్ చట్టం నిబంధనలకు వ్యతిరేకంగా మనీష్ భవన నిర్మాణం ఉన్నట్లు అధికారులు తెలిపారు. అంతేగాక దీని కట్టడంలో నాలుగు ఉల్లంఘనలు ఉన్నట్లు బీఎంసీ నోటీసులో పేర్కొంది. (చదవండి: ‘క్వీన్’ ఆఫీస్లో కూల్చివేతల) మొదటి అంతస్తును ఇటుక రాతితో రెండు గోడలు అక్రమంగా నిర్మించి క్యాబిన్లుగా పార్టిషన్స్ చేశారని, రెండవ అంతస్తులో గోడలను ఆనధికారికంగా నిర్మించడమే కాకుండా, అదే అంతస్తులో టెర్స్ మీద సిమెంట్ షీట్ పైకప్పు, సెడ్లను నిర్మాణాం, అలాగే టేర్స్పై ఉక్కు రాడ్లు, సిమెంట్ షీట్ను పైకప్పు నిర్మించినట్లు నోటీసులలో వివరించారు. అయితే కంగనా కార్యాలయాన్ని ముంబై హైకోర్టు ఆదేశాల మేరకే కూల్చిట్లు బీఎంసీ ఇవాళ స్పష్టం చేసింది. అంతేగాక కంగనా రనౌత్ కార్యాలయం కూల్చివేతపై మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి ఉన్నతాధికారులను ఇవాళ ఉదయం ప్రశ్నించారు. కాగా గత కొద్ది రోజులుగా శివసేనకు, కంగనాకు మధ్య జరుగుతున్న మాటల యుద్ధం నేపథ్యంలో కంగనా ముంబైని పీఓకేతో పోలుస్తూ సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఈ వివాదం మరింత ముదిరింది. (చదవండి: కంగన ఆఫీస్ కూల్చివేత.. గవర్నర్ సీరియస్!) -
‘ఈ రోజు తన ఆలోచనతోనే లేచాను’
ముంబై: ‘మీది మనోహరమైన నవ్వు.. స్నేహ పూర్వక మనస్తత్వం.. గొప్ప నటుడివి’ అంటూ సుశాంత్ సింగ్ రాజ్పుత్తో చెప్పిన మాటాలను ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా గుర్తుచేసుకున్నారు. 2016లో తన ఫ్యాషన్ ప్రదర్శనలో షో టాపర్గా ర్యాంప్ చేసిన నాటి సంఘటనను ఆయన సోషల్ మీడియాలో సోమవారం పంచుకున్నాడు. సుశాంత్ ఫ్యాషన్ షోకు సంబందించిన వీడియోను షేర్ చేస్తూ.. ‘‘అప్పుడే సుశాంత్ను మొదటిసారి కలిసాను. అతడిని చూడగానే నా కొత్త కలెక్షన్స్కు సరిగ్గా సరిపోతాడని భావించి ఫ్యాషన్ షోలో ర్యాంప్ చేయాలని కోరాను. దానికి సుశాంత్ అంగీకరించి వెంటనే డ్రస్ ఫిట్టింగ్ కోసం ఇంటికి వచ్చాడు. ఆ దుస్తుల్లో సుశాంత్ చాలా అందంగా ఉన్నాడు’’ అంటూ ఇన్స్టాలో పోస్టు చేశాడు. (సుశాంత్ ఇంట మరో విషాదం) అయితే ‘‘ర్యాంప్ వాక్ కోసం ప్రాక్టిస్ చేస్తుండగా సుశాంత్ చాలా ఇబ్బంది పడ్డాడు. అప్పుడు నేను నువ్వు గొప్ప నుటుడివి, ప్రతిభావంతుడి.. నీ నవ్వు మనోహరంగా ఉంటుంది. షోలో నీ నవ్వును ప్రదర్శించు చాలు అని చెప్పాను. అలాగే చేశాడు. షో టాపర్గా సుశాంత్ అద్భుతంగా కనిపించాడు. ఆ రోజు ఎప్పటికీ ప్రతిష్టాత్మక జ్ఞాపకం. ఈ రోజు అతడి ఆలోచనతోనే లేచాను. అతడి మరణాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్న’’ అంటూ రాసుకొచ్చాడు. కాగా సుశాంత్ ముంబైలోని తన నివాసంలో సుశాంత్ ఆదివారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ టీవీ, సినీ నటులు, కొద్ది మంది సన్నిహితుల మధ్య ముంబైలోని పవన్ హన్స్ శ్మశానవాటికలో సోమవారం సుశాంత్ అంత్యక్రియలు జరిగాయి. (రియా చక్రవర్తిని విచారించిన పోలీసులు) View this post on Instagram I had met him only once before and then asked him to walk for the show as I felt he suited this collection. He immediately agreed and came home for fittings .. when he came for rehearsals he said he was nervous as he had not walked before and I remember telling him you are such a good actor you will be fine and just smile as your smile is endearing and charming .. He was wonderful in this show as he and @shraddhakapoor walked and made a lovely pair together and today this is a wonderful cherished memory forever .. I woke up this morning thinking about him & still can’t beileve it. It’s really sad and how I wish this had not happened. You will be dearly missed. #sushantsinghrajput #memories A post shared by Manish Malhotra (@manishmalhotra05) on Jun 15, 2020 at 1:59am PDT -
ఆయన మొదటి జీతం ఎంతో తెలుసా!
సెలబ్రెటీ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. బాలీవుడ్ తారలు శ్రీదేవి నుంచి ఇప్పటీ యువ తారల సినిమాలకు ఎన్నో రకాల డిజైనర్ డ్రెస్లను అందింస్తూ తేరపై వారి అందాన్ని మరో లెవల్కు చేరుస్తారు. అంతేగాక అంతర్జాతీయంగా ఫ్యాషన్ షోలు చేస్తూ.. తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు మనీష్ మల్హోత్రా. ఇక ఎప్పుడు బిజీగా ఉండే ఆయన తాజాగా హ్యూమన్ బాంబేకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన ఫ్యాషన్ ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ స్థాయికి చేరడానికి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నానని, పంజాబీ కుటుంబంలో జన్మించిన తనకు ఫ్యాషన్ పట్ల, బాలీవుడ్ సినిమాలపై చిన్నతనం నుంచే ఆసక్తి ఉండేదన్నారు. అంతేగాక డిజైనర్గా ఎదగాడానికి ఆయన తల్లి సహాకారం కూడా ఎంతో ఉందని గుర్తుచేసుకున్నారు. డిజైనర్గా అగ్రస్థానంలో ఉన్న మనీష్ సినీ పరిశ్రమలో ఫ్యాషన్ డిజైనర్గా 30 వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భంగా మాట్లాడుతూ.. ‘చిన్నప్పటీ నుంచే నాకు ఫ్యాషన్తో పాటు బాలీవుడ్ సినిమాలంటే పిచ్చి. నిజం చెప్పాలంటే ఆ పిచ్చే నన్ను ఈ స్థాయికి చేర్చింది. ఇక ఫ్యాషన్పై ఇష్టంతో చదువుపై పెద్దగా శ్రద్ద చూపలేదు. ఇక నేను 6వ తరగతిలో ఉన్నప్పుడు ఓ పెయింటింగ్ క్లాస్కు వెళ్లాను. అది నన్ను ఎంతగానో ఆకర్షించింది. ఆ క్లాస్ బాగా నచ్చింది. దానిని నేను బాగా ఎంజాయ్ చేశాను. ఇక సినిమాలలోని హీరో, హీరోయిన్లు ధరించిన దుస్తులను చూసి మా అమ్మ చీరలు, డ్రెస్లతో ప్రయోగాలు చేసేవాడిని’ అని మనీష్ చెప్పారు. ‘అలా నాకు ఫ్యాషన్ పట్ల మరింత ఆసక్తి పెరిగింది. ఎంతగా అంటే.. తరచూ మా అమ్మకు నేను ఫ్యాషన్ గురించి సలహాలు ఇస్తూ ఉండేవాడిని’ అని చెప్పుకొచ్చాడు. కాలేజీలో చేరినప్పుడు బొటిక్లో పనిచేస్తూ.. మోడలింగ్ చేయడం ప్రారంభించాను. అలా ఏడాదిన్నారపాటు ఆ బొటిక్లో పని చేశా. అప్పుడు నాకు నెలకు రూ.500 జీతం వచ్చేది. దాన్ని నేను చాలా విలువైనదిగా భావించేవాడిని. ఫ్యాషన్ డిజైనింగ్లో అధ్యయనం చేయడం కోసం విదేశాలకు వెళ్లాలనుకున్నాను. కానీ ఆర్థిక కారణాల వల్ల విదేశాలకు వెళ్లలేకపోయాను. ఇక నా సొంతంగా ఓ స్కూల్ పెట్టి క్లాస్లు చెబుతూ.. గంటల తరబడి స్కెచ్ డిజైన్స్ గీస్తూ ఉండేవాడిని’ అంటూ వివరించారు. ఈ క్రమంలో తన 25వ ఏటా జూహీ చావ్లా సినిమాకు డిజైనర్గా పనిచేసే అవకాశం వచ్చిందని చెప్పారు. ఆ తర్వాత 1995లో వచ్చిన అమీర్ఖాన్, ఊర్మీళ, జాకీర్ ష్రాఫ్ల ‘రంగీలా’ డిజైనర్గా పని చేసినందుకు మొదటి ఫీలింఫేర్ ఆవార్డు అందుకున్నట్లు ఆయన చెప్పారు. ‘అలా ఎన్నో సినిమాలకు పని చేస్తూ.. ఫ్యాషన్ షోలో భాగంగా ప్రపంచమంత తిరిగేవాడిని. ఈ నేపథ్యంలో 2005లో నా సొంతంగా ఫ్యాషన్ లాబెల్ను ప్రారంభించాను. అలా ఫ్యాషన్ డిజైనర్గా ఎదిగాను’ అంటూ ఫ్యాషన్పై తనకున్న ఇష్టాన్ని తెలిపారు. ఈ స్థాయికి చేరడంమంటే సాధారణ విషయం కాదని, ఎన్నో అవమానాలు, విమర్శలు ఎదుర్కోని సమస్యలను అదిగమిస్తేనే మనం అనుకున్న స్థాయికి చేరగలమన్నారు. ఇక బాలీవుడ్ సినీ పరిశ్రమలో ప్రస్తుతం నాలుగో తరం నటి, నటులతో పనిచేస్తున్న మనీష్ .. ఈ ఏడాదితో పరిశ్రమలో ఫ్యాషన్ డిజైనర్గా అగ్రస్థానంలో ఉన్నప్పటికీ ఫ్యాషన్ షో ఇచ్చేముందు భయపడతానని తెలిపారు. నేన ఈ స్థాయికి ఎలా వచ్చాను, ఎక్కడి నుంచి వచ్చాను.. అనే విషయాలను నేను మర్చిపోలేనని చెబుతూ తన నిరాంబరతను చాటుకున్నాడు మనీష్ మల్హోత్రా. -
‘ఏదైనా ఉందంటే అది శ్రీదేవి మరణమే’
ముంబై: అతిలోక సుందరి శ్రీదేవి మరణించడం తన జీవితంలోని అత్యంత బాధాకరమైన విషయాల్లో ఒకటని బాలీవుడ్ ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా అన్నాడు. శ్రీదేవి శాశ్వతంగా ఈ లోకాన్ని విడిచివెళ్లడం వ్యక్తిగతంగా, వృత్తిపరంగా తనకు తీరని లోటు అని విచారం వ్యక్తం చేశాడు. మోడల్గా కెరీర్ ఆరంభించి.. బాలీవుడ్ స్టార్ ఫ్యాషన్ డిజైనర్గా ఎదిగిన మనీష్ మల్హోత్రా తన జీవితంలోని ముఖ్యమైన సంఘటనల గురించి ప్రఖ్యాత హ్యూమన్స్ ఆఫ్ బాంబే పేజీతో పంచుకున్నాడు. తాను సంప్రదాయ పంజాబీ కుటుంబంలో జన్మించానని, బాలీవుడ్ మీద ఉన్న ప్రేమతో ఎంతో కష్టపడి ఈ రంగంలో అడుగుపెట్టానని పేర్కొన్నాడు. ‘‘సాధారణ కుటుంబంలో పుట్టిన నాకు... విదేశాల్లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చదివేంత స్థోమత లేదు. అందుకే సొంతంగానే డిజైనింగ్ నేర్చుకున్నా. గంటల తరబడి స్కెచెస్ గీసేవాణ్ణి. మొదట్లో ఓ బొటిక్లో మోడల్గా పనిచేసేవాడిని. అప్పుడు నా నెల జీతం రూ. 500. బాలీవుడ్ సినిమాలు చూస్తూ సమయం గడిపేవాడిని. ఇలా జీవితం సాగిపోతుండగా... 25 ఏళ్ల వయస్సులో నా కెరీర్ ప్రారంభమైంది. జూహీ చావ్లా సినిమాలో పనిచేసే అవకాశం లభించింది. ఆ తర్వాత 1995లో విడుదలైన ‘రంగీలా’ సినిమాతో నా కెరీర్ మలుపు తిరిగింది. ఆ సినిమాకు బెస్ట్ క్యాస్టూమ్ డిజైనర్గా ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది. ఇలా 30 ఏళ్ల కెరీర్లో ఎన్నెన్నో విజయాలు లభించాయి. ఇక నా జీవితంలో అత్యంత బాధపడిన, చెత్త విషయం ఏదైనా ఉందంటే అది శ్రీదేవి మరణమే’’ అని మనీష్ చెప్పుకొచ్చాడు. కాగా బాలీవుడ్ అగ్ర తారలందరికీ అభిమాన క్యాస్టూమ్ డిజైనర్గా ఉన్న మనీష్ మల్హోత్రా.. శ్రీదేవికి కూడా వ్యక్తిగత డిజైనర్గా ఉండేవారు. ప్రస్తుతం ఆమె కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్లకు కూడా దుస్తులు డిజైన్ చేస్తున్నారు. -
‘విజయ్ దేవరకొండ, ప్రభాస్ అంటే ఇష్టం’
సాక్షి, హైదరాబాద్: భారతీయ ఫ్యాషన్ డిజైనర్లలో టాప్లో ఉన్న బాలీవుడ్ డిజైనర్ మనీష్ మల్హోత్రా నగరానికి వచ్చారు. మాదాపూర్లోని హెచ్ఐసీసీలో శనివారం రాత్రి నిర్వహించిన బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్లో తన కలెక్షన్స్ను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన పంచుకున్న విశేషాలు ఆయన మాటల్లోనే... నా అభిమాన డ్రెస్ శారీ. కాటన్ శారీ, టెంపుల్ శారీ, షిఫాన్ శారీ, పోచంపల్లి... ఇలా ఏదైనా సరే చీర కట్టుడు నాకు నచ్చే వస్త్రధారణ. ఇప్పటి ఫ్యాషన్లో బాగా ఇండివిడ్యువాలిటీ వ్యక్తమవుతోంది. ఇప్పుడు ఏదీ రెగ్యులర్ ఫార్మాట్లో ఉండాల్సిన అవసరం లేదు. తమదైన స్టైల్ని కోరుకుంటున్నారు. సినిమాలు చూడాలని అమ్మ ప్రోత్సహించేది... చిన్నప్పటి నుంచి సినిమాలంటే చాలా ఇష్టం. సహజంగా ఆ సమయంలో పిల్లలు సినిమాలు చూస్తుంటే పెద్దలు అడ్డుపడతారు. కాని మా అమ్మ నన్ను చూడమని ప్రోత్సహించేది. అంతేకాదు చిన్న వయసులోనే నా రూమ్లో పెట్టుకున్న వస్తువులు చూసి మా అబ్బాయి టైలర్ అంటూ సంతోషంగా చెప్పుకునేది. చాలా చిన్న వయసులోనే మోడలింగ్కు రావడానికి ఆమె ప్రోత్సాహం నాకు ఉపకరించింది. శ్రీదేవిఅభిమాన నటి... చాలా మంది నటీ నటులతో పనిచేసినా... శ్రీదేవి అభిమాన తార. నేను కొత్తగా వచ్చేటప్పటికి ఆమె బిగ్ స్టార్. మోడలింగ్ బ్యాక్ గ్రౌండ్తో సినీరంగంలోకి వచ్చాను. అప్పుడు నాకు 23 ఏళ్లు చాలా నెర్వస్గా ఉండేవాడ్ని. అలాంటి పరిస్థితుల్లో శ్రీదేవి నుంచి ఎన్నో నేర్చుకున్నాను. ప్రవర్తనతో పాటు లైనింగ్ లేని స్లీవ్స్, స్కర్ట్ కట్స్... వంటి ఆమె దుస్తులు కూడా నాకు డిజైనింగ్లో ఉపకరించాయి. ఖుదాగవా సినిమాలో తన కోసం స్వెట్టర్ రూపొందించి అందించడం, ఆమె అది పెయింటెడ్ కావాలనడం... ఇలా ఆమెతో పనిచేసినప్పుడు ఎన్నో మరచిపోలేని జ్ఞాపకాలు ఉన్నాయి. రోజుకు 18గంటలు... ఏదైనా సరే కఠినమైన డిజైనింగ్ వర్క్ అంటే అది నాకే ఇవ్వాలని అనుకుంటారు. అది నాకు ఛాలెంజింగ్గా అనిపిస్తుంది. ఈ మధ్యే మొఘలుల చరిత్ర నేపథ్యతో రూపొందుతున్న సినిమాలో భాగమయ్యా. ఎంతో స్టడీ చేయాల్సి వస్తోంది. ఇప్పటికీ రోజుకు 12, 18గంటలు కూడా పనిచేస్తున్నా. ఏదేమైనా.. మరే డిజైనర్కీ సాధ్య పడని విధంగా ఇండియన్ ఫ్యాషన్ బిజినెస్లో ఒక ముఖ్యమైన భాగంగా మారాను. అది నాకు గర్వంగా అనిపిస్తుంది. దోశ, చికెన్.. సిటీ గ్రీన్ ఈ సిటీ బాగుంటుంది. ఇటీవలే జూబ్లీహిల్స్ లో నా లేబుల్తో ఒక పెద్ద ఫ్యాషన్ స్టోర్ కూడా ఏర్పాటు చేశాను. ముఖ్యంగా హైదరాబాద్ ఫుడ్ నాకు ఇష్టం. చికెన్ విత్ దోశ టేస్ట్ చేయకుండా వెళ్లను. ఇక్కడ గ్రీనరీ కూడా బాగా ఎక్కువే.. సిటీ ఇంత మోడ్రన్గా ఉన్నా కల్చర్కు ఇచ్చే ఇంపార్టెన్స్ మెచ్చకోవాలి. ముఖ్యంగా పెళ్లి టైమ్లో సంప్రదాయ దుస్తులు, సంగీత్ వంటి ఈవెంట్లు ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తారు. టాలీవుడ్లో నాకు సమంత, విజయ్ దేవరకొండ, ప్రభాస్, ఎన్టీయార్, మహేష్, పూజాహెగ్డే... నాకు నచ్చే తారల లిస్ట్ ఎండ్లెస్. నిత్యవిద్యార్థులమే... నా అసలు వయసు 53 అయినా కాస్ట్యూమ్స్ డిజైనర్గా వయసు 30 ఏళ్లు. నా లేబుల్ వయసైతే కేవలం 15 ఏళ్లు. అలాగే బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ కూడా 15ఏళ్లు పూర్తి చేసుకుంటోంది. సో.. ఈ సందర్భం ఇద్దరికీ చాలా ముఖ్యమైనది. అందుకే ఈ షో చాలా స్పెషల్. తరాలకు అతీతంగా నటీనటులతో పనిచేస్తున్నా. -
డబుల్ గ్లామర్
రెండు భిన్నమైన రంగుల లెహంగా ఒకటి.. ఒకే రంగులో రెండు పొరల లెహంగా మరొకటి. ఒకేరకం ఫ్యాబ్రిక్ లెహంగా ఒకటి.. రాసిల్క్– నెటెడ్ రెండు రకాల మెటీరియల్తోడిజైన్ చేసిన లెహంగా మరొకటి.ఇలా దేనికది భిన్నంగా, మది దోచేలా ఆకట్టుకుంటున్నాయి ఈ టు లేయర్డ్ లెహంగాలు. ట్విన్ లేయర్డ్ లెహంగాలుగానూ పేరున్న ఇవి వేడుకల్లో హైలైట్గా నిలుస్తున్నాయి. క్యాజువల్గానూ కలర్ఫుల్ అనిపిస్తున్నాయి. డబుల్ గ్లామర్ అని ప్రశంసలు అందుకుంటున్నాయి. ఇండియన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఈ యేడాది వెడ్డింగ్ సీజన్లో భాగంగా డబుల్ లేయర్డ్ లెహంగాలను డిజైన్ పలువురి ప్రముఖుల ప్రశంసలు పొందారు. ‘వివాహ వేడుకల్లో గ్రాండ్గా వెలిగిపోవడానికి గ్రాండ్ ఎంబ్రాయిడరీతో పాటు ట్విన్ లేయర్డ్ కూడా ప్రధాన కారణం’ అంటారు మనీష్ మల్హోత్రా. కుచ్చుల లెహంగా గురించి మనకు తెలిసిందే. లెహంగా ఎన్ని కుచ్చులతో ఉంటే అంచు భాగం అంత ఫ్లెయర్తో ఆకట్టుకుంటుంది. ►ఉత్తర భారతదేశంలో దాండియా వేడుకల్లో భాగంగా పుట్టుకొచ్చిందే ఈ రెండు పొరల లెహంగా. దీనికి డిజైనర్ టచ్ ఇచ్చి సౌతిండియా సైతం సరికొత్తగా ముస్తాబు చేసింది. వేడుకల్లో ప్రత్యేకంగా నిలిపింది. ►ఒక లెహంగా పార్ట్ని తక్కువ కొలత తీసుకొని, దాని అంచు వద్ద మరొక పొరగా కుచ్చుల భాగాన్ని జత చేస్తే ఈ అందమైన లెహంగా డిజైన్ వచ్చేస్తుంది. ►పై భాగం ప్లెయిన్ పట్టు మెటీరియల్ తీసుకుంటే, కుచ్చుల భాగం నెటెడ్తో జత చేస్తే ఇలా కొత్తగా కనువిందుచేస్తుంది. ►ఈ లెహంగాకి వెస్ట్రన్ స్టైల్ క్రాప్టాప్ ధరిస్తే ఇండో–వెస్ట్రన్ లుక్లో ఆకట్టుకుంటారు. ►లాంగ్ జాకెట్ ధరిస్తే ఒకలా, ఎంబ్రాయిడరీ ఛోలీ ధరిస్తే మరోలా భిన్నమైన లుక్లో కనిపిస్తారు. ►కాటన్, సిల్క్, నెటెడ్.. ఇలా ఏ ఫ్యాబ్రిక్తోనైనా ఈ డబుల్ లేయర్డ్ లెహంగాలను డిజైన్ చేసుకోవచ్చు. -
జాన్వీ పార్టీ డ్రెస్ ఖరీదు ఎంతంటే..
సాక్షి, ముంబై : అందాల నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ధడక్ మూవీతో బాలీవుడ్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచారు. జాన్వీకి సంబంధించి ప్రతి వార్తనూ పరిశ్రమ ఆసక్తిగా గమనిస్తోంది. ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఇటీవల ముంబైలో ఇచ్చిన పార్టీకి హాజరైన జాన్వీ తన లుక్స్తో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ పార్టీకి జాన్వీ ఎరుపు రంగు సిల్క్ క్రీప్ బటన్ అప్ షర్ట్, అదే కలర్ ట్రౌజర్స్తో హాజరై మెస్మరైజ్ చేశారు. రెడ్ డ్రెస్తో పాటు నలుపు రంగు బ్యాగ్, యాక్సెసరీస్తో స్టన్నింగ్ లుక్లో మెరిశారు. జాన్వీ డ్రెస్ ఖరీదు భారతీయ కరెన్సీలో రూ లక్షా1725 కావడం గమనార్హం. -
ఫ్యాషన్ షోలో మెరిసిన సల్మాన్ ,కత్రినా
-
కరీనాకేమయ్యింది...
న్యూ ఢిల్లీ : కరీనా కపూర్కు ఏమైంది, అసలు ఆమె ఆహారం తీసుకుంటుందా లేదా? ఎందుకిలా అస్థిపంజరంలా మారిపోయింది...మళ్లీ ఏదైనా సర్జరీ చేయించుకుందా, లేదా మళ్లీ సైజ్ జీరో కోసం ప్రయత్నిస్తుందా...అంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. విషయమేంటంటే కరీనా కపూర్ అప్పుడప్పుడు ర్యాంప్ వాక్ చేస్తుందని అందరికి తెలిసిన విషయమే. గర్భవతిగా ఉన్నప్పుడు కూడా ఆమె ర్యాంప్ వాక్చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. 2016 డిసెంబర్లో తైమూర్ పుట్టిన తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు ఆమె ర్యాంప్ వాక్ చేశారు. తన అభిమాన డిజైనర్ మనిష్ మల్హోత్రా కోసం తన బెస్ట్ ఫ్రెండ్ అమృత అరోరాతో కలిసి సింగపూర్లో నిర్వహించిన ఒక ఫ్యాషన్ షోలో ర్యాంప్ వాక్ చేశారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోలను అమృత అరోరా తన ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేశారు.ఈ ఫోటోల్లో కరీనా మరీ పీలగా.. చిక్కిపోయినట్లు ఉన్నారు. ఈ ఫోటోలు చూసి నిరుత్సాహపడిన అభిమానులు కరీనాకు ఏమైంది అస్థిపంజరంలా తయారయ్యింది, మళ్లీ సైజ్ జీరో కోసం ప్రయత్నిస్తుందా, ఏదైనా సర్జరీ చేయించుకుందా అంటూ రకరకాల కామెంట్లు చేశారు. కొందరు కరీనా తన వయసు కంటే పెద్దదిగా కన్పిస్తుందని అమృత అరోరానే అందంగా ఉందని కామెంట్ చేశారు. తల్లి అయ్యాక కరీన తన బరువును తగ్గించుకోవడానికి చాలా శ్రమపడ్డారు. అందుకు సంబంధించి ఆమె జిమ్లో కష్టపడుతున్న ఫోటోలను తన అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం కరీనా శశాంక్ ఘోష్ ‘వీర్ ది వెడ్డింగ్’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంతో కరీనాతో పాటు సోనమ్ కపూర్, స్వర భాస్కర్ లు కీలక ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
త్రినయని సీరియల్ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్ (ఫోటోలు)
స్టార్ హీరో గొప్పమనసు.. రూ. కోటి చెక్ విరాళం!
ఎరక్కపోయి ఇరుక్కుపోయి
మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్.. మెక్ గర్క్ సిల్వర్ డక్! వీడియో
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్గా మళ్లీ కోహ్లినే!
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
స్వాతి మలివాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
'ఆ రూలే ఐపీఎల్ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement