బయటి కంపెనీతో మనీశ్ మొదటి ఒప్పందం! 40 శాతం వాటా రిలయన్స్కి..
Reliance Buys Manish Malhotra Stakes: వస్త్ర ప్రపంచంలో తన బ్రాండ్తో దూసుకుపోతున్న ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ బ్రాండ్స్ లిమిటెడ్.. భారీ ఒప్పందం దిశగా అడుగులు వేసింది. ప్రముఖ డిజైనర్ లేబుల్ ‘మనీశ్ మల్హోత్రా’లో 40 శాతం వాటా చేజిక్కించుకోబోతోంది.
పదహారేళ్లుగా దేశం నుంచి ప్రపంచవ్యాప్తంగా పేరు విస్తరించుకున్న మనీశ్ మల్హోత్రా బ్రాండ్లో రిలయన్స్ మెజార్టీ వాటా కొనుగోలు చేయనుంది. మనీశ్ మల్హోత్రా బయటి కంపెనీతో ఒప్పందం చేసుకోవడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ మేరకు మనీశ్తో ఒప్పందాన్ని గౌరవంగా భావిస్తున్నామని రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ డైరెక్టర్ ఇషా అంబానీ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
ఇక ఇప్పటికే ఢిల్లీ, హైదరాబాద్ లాంటి ప్రముఖ నగరాల్లో స్టోర్లను నడిపిస్తున్న మనీశ్ మల్హోత్రా.. దేశంలోనే మొదటి వర్చువల్ స్టోర్ తెరిచిన ఫీట్ సైతం సాధించారు. ‘భారత సంప్రదాయాల్ని ప్రతిబింబించేలా దుస్తుల్ని రూపొందించడం ఈ లేబుల్ ప్రత్యేకత. రియలన్స్తో ఒప్పందం ద్వారా దేశ, విదేశాలకు సేవలను విస్తరిస్తామ’ని ఈ సందర్భంగా మనీశ్ మల్హోత్రా(54) తెలిపారు.
మరిన్ని వార్తలు