థ్రిల్లింగ్‌ శబ్దం  | Aadhi Pinisetty Sabdham Teaser Release | Sakshi
Sakshi News home page

థ్రిల్లింగ్‌ శబ్దం 

Apr 13 2024 3:50 AM | Updated on Apr 13 2024 3:50 AM

Aadhi Pinisetty Sabdham Teaser Release - Sakshi

హీరో ఆది పినిశెట్టి, దర్శకుడు అరివళగన్‌ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ‘శబ్దం’. ఈ సూపర్‌ నేచురల్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ మూవీలో సిమ్రాన్, లైలా లీడ్‌ రోల్స్‌లో నటించగా, 7జీ శివ నిర్మించారు. తెలుగు–తమిళ భాషల్లో రూపొందిన ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘శబ్దం’ టీజర్‌ను హీరో వెంకటేశ్‌ షేర్‌ చేశారు.

‘‘ఆది పినిశెట్టి– అరివళగన్‌ కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రం ‘వైశాలి’ విజయం సాధించింది. ఇప్పుడు ‘శబ్దం’ వస్తోంది. ఈ సినిమాలోని చాలా సన్నివేశాలను పర్వతాలు, పర్యాటక ప్రదేశాల్లో చిత్రీకరించాం. అలాగే 120 ఏళ్ల క్రితం నాటి లైబ్రరీని కూడా నిర్మించాం. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అని యూనిట్‌ పేర్కొంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement