ఆ అవార్డుకు రిషబ్‌ శెట్టి అర్హుడు: అల్లు అర్జున్‌ | 70th National Film Awards 2024: Allu Arjun Appreciates National Award Winners | Sakshi
Sakshi News home page

ఆ అవార్డుకు రిషబ్‌ శెట్టి అర్హుడు: అల్లు అర్జున్‌

Aug 17 2024 11:55 AM | Updated on Aug 17 2024 12:07 PM

70th National Film Awards 2024: Allu Arjun Appreciates National Award Winners

భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా భావించే జాతీయ చలన చిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. 70వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో ఉత్తమ నటుడి అవార్డుకు ఎంపికైన రిషబ్‌ శెట్టి, ఉత్తమ నటి అవార్డుకు ఎంపికైన నిత్యామీనన్‌కు ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ పెట్టాడు

‘నేషనల్‌ అవార్డు విన్నర్స్‌ అందరికి నా హృదయ పూర్వక అభినందనలు. రిషబ్‌ శెట్టి ఉత్తమ నటుడు అవార్డుకు అర్హుడు. అలాగే నా చిరకాల స్నేహితురాలు నిత్యా మేనన్‌ ఉత్తమ నటిగా అవార్డును సొంతం చేసుకోవడం ఆనందంగా ఉంది. జాతీయ అవార్డులు గెలుపొందిన అందరికీ నా శుభాకాంక్షలు. నిఖిల్‌, చందు మొండేటిలకు ప్రత్యేక అభినందనలు. ‘కార్తికేయ2’ విజయం సాధించినందుకు ఆ టీమ్‌ అందరికీ శుభాకాంక్షలు’ అని అల్లు అర్జున్‌ ఎక్స్‌లో రాసుకొచ్చాడు.

అవార్డు బాధ్యత పెంచింది : చందూ మెండేటి
‘‘మా సినిమాకి జాతీయ అవార్డు రావడం మా బాధ్యతని మరింత పెంచింది. ‘కార్తికేయ 2’ తర్వాత ‘కార్తికేయ 3’పై అంచనాలు ఎంతలా పెరిగాయో తెలుసు. ఆ అంచనాలకు తగ్గట్టుగా ‘కార్తికేయ 3’ ఉంటుంది’’ అని డైరెక్టర్‌ చందు మొండేటి అన్నారు. నిఖిల్‌ సిద్ధార్థ్, అనుపమా పరమేశ్వరన్‌ జోడీగా చందు మొండేటి దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మించిన చిత్రం ‘కార్తికేయ 2’. ప్రాంతీయ విభాగంలో ఉత్తమ చిత్రం అవార్డును సాధించిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement