చేగుంట(తూప్రాన్): మండల కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఆదివారం జిల్లాస్థాయి యోగా పోటీలు నిర్వహించారు. సర్పంచ్ స్రవంతి పోటీలను ప్రారంభించగా, అండర్ 14 నుంచి 50 సంవత్సరాల వయసు గలవారు పాల్గొన్నారు. ఆయా మండలాల నుంచి 200 మంది పోటీల్లో పాల్గొనగా, ప్రతిభ కనబర్చిన వారికి ప్రశంసాపత్రాలను అందించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ రఫీ, రాష్ట్ర అబజర్వర్ సతీష్, జడ్జీలుగా సత్యం, శ్రీదేవి, మాలతి, మల్లీశ్వరీ, శ్రీలత, నర్సింలు, మనీష, రేఖ, అంజయ్య, దీపక్, ప్రసన్న త దితరులు పాల్గొన్నారు.


