
వన దుర్గకు పోటెత్తిన భక్తులు
పాపన్నపేట(మెదక్): ఏడుపాయల వన దుర్గమ్మ ఆలయం ఆదివారం భక్త జనసంద్రంతో కిక్కిరిసింది. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు. అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఎండలు మండుతున్నా భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి విచ్చేశారు. భక్తులకు ఇబ్బందుల్లేకుండా ఆలయ ఈఓ చంద్రశేఖర్, సిబ్బంది, ఎస్సై శ్రీనివాస్గౌడ్ ఏర్పాట్లు చేశారు.
ఎస్టీ డిగ్రీ గురుకులంలో
ప్రవేశాలకు దరఖాస్తులు
కౌడిపల్లి(నర్సాపూర్): ఎస్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో డిగ్రీ బాలుర కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కౌడిపల్లి ఎస్టీ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ఫణికుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలోని ఎస్టీ బాలుర డిగ్రీ గురుకుల కళాశాలలో మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు చెందిన ఎస్టీ, ఎస్సీ, బీసీ విద్యార్థులు అడ్మిషన్ తీసుకోవాలని పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
మూగజీవాల
దాహార్తికి నీటి తొట్లు
నర్సాపూర్: వేసవిని దృష్టిలో పెట్టుకొని అడవి జంతువుల దాహం తీర్చేందుకు ఓ స్వచ్ఛంద సంస్థ నీటి తొట్లు ఏర్పాటు చేసింది. హైదరాబాద్కు చెందిన సర్వ్ నీడి వాలంటరీ ఆర్గనైజేషన్ సంస్థ ప్రతినిధులు నర్సాపూర్ అడవిలోని మూగజీవాల దాహార్తిని తీర్చడానికి తమ వంతు ప్రయత్నానికి నడుం బిగించారు. ఇందులో భాగంగా ఆదివారం 15 నీటి తొట్లను అడవిలో ఏర్పాటు చేశారు. సంస్థ ప్రతినిధుల అభ్యర్థన మేరకు స్థానిక మున్సిపాలిటీ అధికారులు నీటి ట్యాంకర్లు సమకూర్చడంతో నీటితో నింపారు. కాగా రెండు మూడు రోజులకు ఒకసారి నీటి తొట్లను నింపుతామని సంస్థ ప్రతినిధి పవన్కళ్యాణ్ తెలిపారు.
అంబేడ్కర్ విగ్రహాన్ని
ఏర్పాటు చేయాలి
మెదక్ మున్సిపాలిటీ: రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటులో అధికారులు తీవ్ర వివక్ష చూపుతున్నారని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు యాదగిరి మండిపడ్డారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని రాందాస్ చౌరస్తాలో అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటు స్థలాన్ని ఆయన పరిశీలించి మాట్లాడారు. అధికారికంగా విగ్రహం ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ అధికారులు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. అధికారులు వెంటనే పనులు ప్రారంభించాలని, లేనిచో ప్రతిఘటన పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యనిర్వహక అధ్యక్షుడు బాలరాజ్, ఎమ్మార్పీఎస్ నాయకులు కొమ్ము షేకులు, ప్రభాకర్, ప్రవీణ్, సంపత్ కుమార్, కుమార్, సిద్ది రాములు, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా నాయకుడు శ్రీనివాస్, రత్నయ్య, గోపాల్, గట్టయ్య పాల్గొన్నారు.
జడ్జి ప్రత్యేక పూజలు
హుస్నాబాద్: రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో ఆదివారం హుస్నాబాద్ కోర్టు జడ్జి కృష్ణతేజ్ ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి మొక్కు లు చెల్లించుకున్నారు. అనంతరం జడ్జిని అర్చకుడు పరమేశ్వర్ సన్మానించారు.

వన దుర్గకు పోటెత్తిన భక్తులు

వన దుర్గకు పోటెత్తిన భక్తులు

వన దుర్గకు పోటెత్తిన భక్తులు