కోటపల్లి: పక్షం రోజుల్లో కూ తురు పెళ్లి.. కుటుంబం ప నుల్లో బిజీగా ఉన్న తరుణంలో ఇంటి పెద్ద మరణం ఆ కుటుంబాన్ని తీవ్ర దుఃఖంలో నింపింది. మండలకేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మండలకేంద్రానికి చెందిన కత్తర్ల శంకర్(49) గ్రామ పంచాయతీలో మల్టీపర్పస్ వర్కర్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆదివారం తెల్లవారు జామున కాలకృత్యాలు తీర్చుకుని వచ్చి నిద్రపోయాడు. ఈ క్రమంలో ఆయనకు ఎవరో ఫోన్ చేస్తుండగా ఎంతకీ లిఫ్ట్ చేయలేదు. భార్య పద్మ వచ్చి గమనించి నిద్రలేపగా స్పందించడం లేదు. వెంటనే అందించిన సమాచారంతో అంబులెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకుని శంకర్ను పరీక్షించి మృతిచెందినట్లు తెలిపారు. మృతుడికి ఇద్దరు కూతుళ్లు. ఈనెల 16న పెద్ద కూతురు సాయికీర్తన వివాహం జరగాల్సి ఉండగా ఇంటి పెద్ద మృతితో విషాదచాయలు అలుముకున్నాయి.


