బెల్లంపల్లి: గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనకు కారకులైన బా ధ్యులపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు బడికెల శ్రావణ్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆశ్రమ పాఠశాలకు వెళ్లి ఫుడ్ ఫాయిజన్తో అస్వస్థతకు గురైన విద్యార్థులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యమైన ఆహారం, పరిశుభ్రమైన తాగునీరు అందించకపోవడం వల్లే ఫుడ్ పాయిజన్ జరిగిందన్నారు. ఇలాంటి ఘట నలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నాయకులు కొట్టే రాకేష్, యాసిన్, విజయ్, సుమంత్, అరుణ్, అఖిల్, తదితరులు పాల్గొన్నారు.


