మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ప్రభుత్వం విడుదల చేసిన నీట్–2026 ఫలితాల్లో జిల్లా కేంద్రంలోని వాగ్దేవి కళాశాల విద్యార్థులు విజయదుందుభి మోగించారు. ఈ మేరకు కళాశాల విద్యార్థులకు ర్యాంకులు సాధించిన విద్యార్థులకు కళాశాల యాజమాన్యం అభినందించింది. కరస్పా డెంట్ వెంకట్రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ధర్మ 554, సిద్ధార్థ 452, రబ్షా 452 మార్కులు సాధించినట్లు పేర్కొన్నారు.తమ కళాశాల విద్యార్థులకు 32కు పైగా సీట్లు సాధించే అవకా శం ఉన్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఐఐ టీ, నీట్ అకాడమిక్ ఇంచార్జీ పావనిరెడ్డి, ప్రిన్సిపాల్ గీతాదేవి, వైస్ప్రిన్సిపాల్ జ్యోతినందన్రెడ్డి, యాకూబ్, షాకీర్, శివకుమార్, సతీష్ రెడ్డి, నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.


