జోగుళాంబ సన్నిధిలో ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్
అలంపూర్: దక్షిణ కాశీ అలంపూర్ క్షేత్ర ఆలయాలను ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ టీ. రవిశంకర్ కుటుంబ సమేతంగా శనివారం దర్శించుకున్నారు. అధికారులు ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్కు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన బాలబ్రహ్మేశ్వర స్వామి, జోగుళాంబ అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు వారిని శేషవస్త్రాలతో సత్కరించారు. అర్చకులు వారికి తీర్ధ ప్రసాదాలు అందజేసి అశీర్వచనం పలికారు. ఈ క్షేత్ర ప్రశస్త్యాన్ని వారికి వివరించారు. వీరితోపాటు అధికారులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.


