పోలీసుల అదుపులో బైక్‌ దొంగలు | - | Sakshi
Sakshi News home page

పోలీసుల అదుపులో బైక్‌ దొంగలు

Aug 13 2026 1:33 AM | Updated on Aug 13 2026 1:33 AM

15 బైక్‌లు స్వాధీనం

బండిఆత్మకూరు: తెలంగాణతో పాటు తదితర ప్రాంతాల్లో బైక్‌లను అపహరిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్రం పెబ్బేరు ప్రాంతంలో జరిగిన బైకు చోరీ కేసులో పట్టుబడిన నిందితుడిని సమాచారం మేరకు అక్కడి పోలీసులు బుధవారం లింగాపురం గ్రామం చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు గ్రామానికి చెందిన వల్లెం వెంకటరమణ, భూమా శివారెడ్డిని అదుపులోకి తీసుకుని వారి నుంచి 15 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మరో వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. మరో బైక్‌ను రికవరీ చేయాల్సి ఉందని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement