నేను తువ్వదొడ్డి గ్రామం వద్ద 8 ఎకరాలు ఏడాదికి రూ.1.76 లక్షల చొప్పున కౌలుకు తీసుకుని అరటి పంట సాగు చేశా. తొలి ఏడాది రూ.22 లక్షలు, రెండో ఏడాది రూ.8 లక్షలు పెట్టుబడి పెట్టాను. తొలి ఏడాది ప్రకృతి వైపరీత్యాలతో తీవ్ర నష్టం జరిగింది. లక్షన్నర మాత్రమే చేతికొచ్చింది. ఇప్పుడు కొనేనాథుడే లేడు. కోత కూలీల ఖర్చులు కూడా రావని పంటంతా వదిలేశా. సాగుకు అయిన రూ.30 లక్షలు అప్పు ఎలా తీర్చాలో తెలియడం లేదు. ప్రభుత్వమే ఆదుకోవాలి. లేకపోతే ఆత్మహత్యే శరణ్యం.
– ఆర్ సుంకన్న, కౌలు రైతు, రామకొండ


