
మహాత్ముల త్యాగమే సమాజ బలం
కర్నూలు కల్చరల్: మహాత్ముల త్యాగమే సమాజ బలమని పలువురు జీయర్ స్వామీజీలు, పీఠాధిపతులు అన్నారు. ఉభయ వేదాంత పండితులు సత్సంప్రదాయ పరిరక్షణ సభ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ శ్రీరంగం నల్లాన్ చక్రవర్తుల రఘునాథాచార్య స్వామి శత జయంతి సందర్భంగా గోదా గోకులంలో ఐదు రోజులుగా జరుగుతున్న శ్రీమద్రామాయణ మహా యజ్ఞం శుక్రవారం ముగిసింది. అందులో భాగంగా 2 వేల మందితో సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించడంతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. త్రిదండి రామచంద్ర రామానుజ జీయర్ స్వామి, త్రిదండి అహోబల రామానుజ జీయర్ స్వామి, త్రిదండి దేవనాథ రామానుజ జీయర్ స్వామి, త్రిదండి అష్టాక్షరీ సంపత్కుమార రామానుజ జీయర్ స్వామి, ప్రయాగ్రాజ్ నుంచి రాఘవ ప్రసన్న జీయర్ స్వామి, శ్రీశ్రీ త్రిదండి శఠగోపముని రామానుజ జీయర్ స్వామి ఆచార్య పరమాత్మానందగిరి స్వామి, విరజానంద స్వామి సందేశం ఇచ్చారు. గోదా గోకులం వ్యవస్థాపక అధ్యక్షులు మారం నాగరాజు గుప్తు, ట్రస్టీ పల్లెర్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

మహాత్ముల త్యాగమే సమాజ బలం