పామర్రు: ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుని, సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టే లక్ష్యంతో జిల్లా యంత్రాంగం ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక(మీ కోసం) కార్యక్రమం నిర్వహిస్తోందని కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. శుక్రవారం పామర్రు నియోజకవర్గ కేంద్రమైన పామర్రులోని ఎస్కేఆర్ఆర్ జెడ్పీ హైస్కూల్ ఎదురుగా ఉన్న ఆరేపల్లి కల్యాణమండపంలో ‘మీ కోసం’ను నిర్వహించారు. కలెక్టర్ ప్రజల నుంచి మొత్తం 30 వినతులను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అందిన ప్రతి అర్జీని సంబంధిత శాఖ అధికారులకు పంపించి, నిబంధనల మేరకు త్వరిత గతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్, సహాయ కలెక్టర్ సమ్రత అగర్వాల్, డీఎస్సీ పల్లా శ్రీనివాసరావు, పామర్రు తహసీల్దార్ జి. రవికాంత్, మండల రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
వచ్చిన అర్జీల్లో కొన్ని..
కలెక్టర్ డీకే బాలాజీ


