కెరమెరి: గ్రామ పంచాయతీలకు అభివృద్ధి నిధులు విడుదలయ్యేలా చూడాలని మండలానికి చెందిన పలువురు సర్పంచులు, నా యకులు మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, డీసీసీ మాజీ అధ్యక్షుడు విశ్వప్రసాద్రావును కోరా రు. శనివారం జిల్లా కేంద్రంలో వారిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో అభివృద్ధి కుంటుపడింద ని తెలిపారు. ప్రభుత్వం, అధికారులు దృష్టికి తీసుకెళ్లి నిధులు విడుదలయ్యేలా చూడాలని కోరారు. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ము నీర్ అహ్మద్, నాయకులు దండుగుల ఎల్లప్ప, యూసూఫ్, సర్పంచులు ఆత్రం లక్ష్మణ్, కుమురం భీంరావు, ఆనంద్రావు, బలవంత్రావు, శంకర్, అమోల్ తదతరులున్నారు.


