
పోలీసుల కుటుంబాలకు అండగా ఉంటాం
ఆసిఫాబాద్అర్బన్: విధి నిర్వహణలో మరణించిన పోలీసుల కుటుంబాల అండగా ఉంటామని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. ఇటీవల గుండెపోటుతో మరణించిన హెడ్ కానిస్టేబుల్ ఎండీ బషీరుద్దీన్ కుటుంబ స భ్యులకు సోమవారం జిల్లా కేంద్రంలో రూ.8 లక్షల విలువైన భద్రత చెక్కు అందించారు. ప్రభుత్వ పరంగా అందాల్సిన ఇతర బెని ఫిట్స్ అందేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో సీఐ రాణాప్రతాప్, పోలీసు సంఘం జిల్లా అధ్యక్షుడు విజయ శంకర్రెడ్డి, ఆర్ఐలు పెద్ద న్న, అంజన్న, నాగుల్ మీరా, ఏవో శ్రీనివాస్, సీనియర్ అసిస్టెంట్ వర్మ పాల్గొన్నారు.