పెద్దాస్పత్రిలో సీజనల్‌ కిటకిట | - | Sakshi
Sakshi News home page

పెద్దాస్పత్రిలో సీజనల్‌ కిటకిట

Jul 21 2026 12:17 AM | Updated on Jul 21 2026 12:17 AM

ఖమ్మం వైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి సోమవారం కిటకిటలాడింది. వాతావరణంలో మార్పులతో వ్యాధుల వ్యాప్తి పెరగగా.. పలువురు జ్వరం, ఇతర సమస్యలతో బాధపడుతున్నారు. దీనికి తోడు వారాంతపు సెలవులు రావడంతో సోమవారం ఉదయం 8 గంటల నుంచే ఓపీ విభాగం వద్ద క్యూ నెలకొంది. జనరల్‌ ఆస్పత్రితో పాటు మాతా శిశు ఆరోగ్య కేంద్రలో కూడా గర్భిణులు, బాలింతలు, చిన్నారుల రద్దీ కనిపించింది. ఆస్పత్రిలో ఈ ఒక్కరోజు మొత్తం 2,500 మంది వరకు వివిధ రకాల వైద్యసేవలు పొందారని అధికారులు తెలిపారు. ఒకేరోజు ఎక్కువ మంది రావడంతో వృద్ధులు, గర్భిణులు ఇబ్బంది పడ్డారు. ఓపీ చీటీ తీసుకుని పరీక్ష చేయించుకునేందుకు చాలా సమయం నిరీక్షించాల్సి వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement