విద్యుత్‌ సర్వీస్‌ తొలగించారని.. ఆగ్రహంతో లైన్‌ ఇన్‌స్పెక్టర్‌పై.. | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ సర్వీస్‌ తొలగించారని.. ఆగ్రహంతో లైన్‌ ఇన్‌స్పెక్టర్‌పై..

Published Tue, Aug 8 2023 12:06 AM

- - Sakshi

ఖమ్మం: ఇంటి విద్యుత్‌ కనెక్షన్‌ తొలగించడంతో ఉద్యోగులపై దాడి చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు. రఘునాథపాలెం పోలీసులు వెల్లడించిన వివరాలు... పది రోజులు క్రితం మండలంలోని హర్యాతండాలో విద్యుత్‌ బిల్లులు చెల్లించని వారి సర్వీసులే అక్రమంగా విద్యుత్‌ వాడుకుంటున్న వారి సర్వీసులను ఉద్యోగులు తొలగించారు.

దీంతో తండాకు చెందిన బి.రాము, వి.శివలాల్‌ సోమవారం మంచుకొండ సబ్‌ స్టేషన్‌ వద్ద సెక్షన్‌ కార్యాలయానికి వచ్చిన వారు తమ ఇళ్లలో కరెంట్‌ లేకుండా చేశారంటూ మంచుకొండ లైన్‌ ఇన్‌స్పెక్టర్‌ బాబురావుపై దాడి చేశారు.

అడ్డొచ్చిన సబ్‌ ఇంజనీరు యాకూబ్‌, జేఎల్‌ఎం దేవీలాల్‌పై సైతం దాడి చేయడమే కాక కార్యాలయంలోని కంప్యూటర్‌, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఇద్దరిపై కేసు నమోదు చేశారు. కాగా, ఏడీ సంజయ్‌కుమార్‌ తదితరులు పరిశీలించి ఎస్‌ఈ సురేందర్‌, డీఈ రామారావు దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement