కొత్తగూడెం మాతా శిశు కేంద్రంలో అమానవీయ ఘటన | Telangana Hospital Incident, Pregnant Woman Delivers Baby While Getting Off Bed And Infant Falls, Probe Ordered | Sakshi
Sakshi News home page

కొత్తగూడెం మాతా శిశు కేంద్రంలో అమానవీయ ఘటన

Jul 16 2026 10:56 AM | Updated on Jul 16 2026 11:42 AM

Inhuman Incident at the Mother and Child Center in Bhadradri

చుంచుపల్లి: కొత్తగూడెంలోని ఎంసీహెచ్‌లో చేరిన నిండు గర్భిణి బాత్‌రూమ్‌కు వెళ్లే క్రమాన ప్రసవించింది. దీంతో బిడ్డ జారి కింద పడగా.. వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బంధువులు ఆందోళన చేపట్టారు. జిల్లాలోని దమ్మపేటకు చెందిన గర్భిణికి నెలలు నిండడంతో బుధవారం కొత్తగూడెం ఎంసీహెచ్‌లో చేర్పించారు. ఈక్రమాన బెడ్‌ కేటాయించిన వైద్యులు... నొప్పులు వస్తే తమకు తెలిజేయాలని సూచించారు.

 కాసేపటికి ఆమె బాత్‌ రూమ్‌కు వెళ్దామని నిలుచునే క్రమాన నొప్పులు రాకుండానే బిడ్డకు జన్మనివ్వడంతో కిందకు జారి పడింది. ఆ తర్వాత బ్లీడింగ్‌ అవుతుండడంతో ఆమె బంధువులు వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యమే కారణమంటూ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు విచారణ చేయగా సదరు గర్భిణి బెడ్‌ దిగుతుండగా నొప్పులు తెలియకుండానే డెలివరీ అయిందని.. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. కాగా, స్థానికులు, కుటుంబ సభ్యులు మాత్రం వైద్యుల నిర్లక్ష్యమే కారణమని కొంతసేపు ఆందోళన వ్యక్తం చేశారు. 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement