మండ్య: మండ్య జిల్లాలోని గాణలు సమీపంలోని గ్రామంలోని ఒక పొలంలో సుమారు 10 అడుగుల పొడవైన కొండచిలువను పట్టుకున్నారు. తోటలో పనిచేస్తుండగా, చెరువులో నుంచి వచ్చిన కొండచిలువను చూసి భయంతో పారిపోయానని రైతు చెప్పారు. స్నేక్ కృష్ణకు సమాచారం ఇవ్వగా ఆయన వచ్చి స్థానికులతో కలిసి దానిని పట్టుకున్నారు. ఆయన మాట్లాడుతూ మిత్రుడు జగదీష్ కలిసి హలగూరు ప్రాంతంలో సుమారు 15 కొండచిలువలను పట్టుకుని అడవిలోకి వదిలివేశామన్నారు. ఏ రకమైన పామును చూసినా దానిని కొట్టవద్దని, మాకు తెలియజేస్తే, మేము వచ్చి దానిని రక్షించి అడవిలో వదిలివేస్తామని తెలిపారు.


