వివాహిత అనుమానాస్పద మృతి | Sakshi
Sakshi News home page

వివాహిత అనుమానాస్పద మృతి

Published Fri, Oct 6 2023 12:14 AM

సంతోష్‌, రేఖ (ఫైల్‌)  - Sakshi

కర్ణాటక: వివాహిత యువతి అనుమానాస్పదంగా మృతిచెందిన సంఘటన యలహంక ఉపనగరలో జరిగింది. యలహంక న్యూటౌన్‌లో నివసిస్తున్న సంతోష్‌ అనే వ్యక్తి భార్య రేఖ (24) ఇంట్లో ఉరివేసుకున్న స్థితిలో మృతిచెందింది. తమిళనాడుకు చెందిన సంతో ష్‌,రేఖ దంపతులు యలహంకలో నివాసముంటూ చిన్నపాటి పనులు చేసుకునేవారు. వీరికి ఏడాది బాబు ఉన్నాడు.

ఇటీవల సంతోష్‌ రేఖను పుట్టింటికి వెళ్లి మరింతగా కట్నం డబ్బులు తీసుకురావాలని పీడించేవాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. దీనిపై ఇద్దరి మధ్య గొడవలు జరిగి సంతోష్‌ రేఖను హత్య చేసి ఉంటాడని ఆరోపిస్తున్నారు. రేఖ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకున్న స్థితిలో శవమై తేలింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని సంతోష్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Advertisement
Advertisement