బాలికపై లైంగికదాడి నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష | Man sentenced to 20 years in prison | Sakshi
Sakshi News home page

బాలికపై లైంగికదాడి నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష

Jul 25 2026 3:32 AM | Updated on Jul 25 2026 3:32 AM

Man sentenced to 20 years in prison

ఒంగోలు వన్‌టౌన్‌: బాలికపై లైంగిక­దా­డికి పాల్పడిన నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ ఒంగోలు పోక్సో కోర్టు జడ్జి కే శైలజ శుక్రవారం తీర్పు చెప్పారు. ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం పరకొండపాడు గ్రామాని­కి చెందిన సాదు శ్యామ్‌ అలి­యాస్‌ శ్యాంసుందరరావు (49) 2020 జూన్‌ 8న ఓ బాలిక(10) ఇంట్లోకి ప్రవేశించి లైంగికదాడి చేశాడు. 

బాలిక తల్లిదండ్రులు పనుల నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత జరిగిన ఘటనను తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేయగా అప్పటి కందుకూరు డీఎస్పీ కండె శ్రీనివా­సరావు కేసు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేసి, కోర్టులో చార్జిషీట్‌ వేశారు. నేర నిరూపణ కావడంతో నిందితు­డికి 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానాను జడ్జి విధించారు. బాధి­తురాలికి నష్టపరిహారంగా రూ.­2,50,000 ఒంగోలు జిల్లా న్యాయ­సేవాధికార సంస్థ ద్వారా అందజేయాలని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement