తిమ్మాపూర్: లోయర్ మానేరు జలాశయంలో బుధవారం వృద్ధురాలి శవం లభ్యమైంది. ఎస్సై వివేక్ తెలిపిన వివరాల ప్రకారం ఎల్ఎండీ రిజర్వాయర్లో వద్ధురాలి శవాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకొని రిజర్వాయర్లో మృతదేహం ఉండగా సమీపంలో ఆధార్కార్డుతో పాటు బ్యాగును పోలీసులు గుర్తించారు. ఆధార్కార్డు ఆధారంగా అందె మల్లవ్వ, ఇందుర్తి అడ్రస్ ఉండడంతో పోలీసులు గ్రామస్తులకు సమాచారం అందించారు. గ్రామస్తుల ద్వారా కుటుంబ సభ్యులకు విషయం తెలియడంతో ఎల్ఎండీ పోలీసులను సంప్రదించారు. మృతదేహాన్ని ఎల్ఎండీ పోలీసులు కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. కాగా వృద్ధురాలికి సంబంధించిన బంధువులు ఫిర్యాదు ఇవ్వలేదని పోలీసులు పేర్కొన్నారు.