రౌడీషీటర్లపై ప్రత్యేక దృష్టి పెట్టండి
కొత్తపల్లి(కరీంనగర్): అర్బన్ పోలీసింగ్పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీపీ గౌస్ ఆలం ఆదేశించారు. కొత్తపల్లి పోలీసుస్టేషన్ను మంగళవారం రాత్రి అకస్మికంగా తనిఖీ చేశారు. వివిధ కేసుల్లో పట్టుబడి పోలీస్స్టేషన్ ఆవరణలో ఉన్న వాహనాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. సిబ్బందితో మాట్లాడి, సరైన పద్ధతిలో రికార్డుల నిర్వహణ, నమోదైన కేసుల వివరాలు సీసీటీఎన్ఎస్లో పొందుపరచాలని సూచించారు. నమోదైన సైబర్ నేరాల గురించి అడిగి తెలుసుకున్నారు. నూతనంగా విధుల్లో చేరిన కానిస్టేబుళ్లకు పలు సూచనలు చేశారు. రికార్డుల నిర్వహణ, సీసీటీఎన్ఎస్, రిసెప్షన్, కోర్టుడ్యూటీ, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, బీట్, పెట్రోలింగ్, సమన్లు మొదలగు విధులను సీనియర్ల ద్వారా తెలుసుకోవాలన్నారు. రౌడీషీటర్లు, హిస్టరీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలన్నారు. కొత్తపల్లి పోలీస్స్టేషన్ ఎస్హెచ్వో ప్రొబేషనరీ ఐపీఎస్ వసుంధర, ఇతర అధికారులు పాల్గొన్నారు.