సాక్షి, అమలాపురం: కోనసీమ అంటే పచ్చని కొబ్బరి తోటల అందం, గోదావరి పాయల పరవశం మాత్రమే కాదు. ఇప్పుడు షటిల్ బ్యాడ్మింటన్కు కూడా చిరునామాగా మారింది. అంతర్జాతీయ డబుల్స్ సంచలనం సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, ఆకుల సునీల్, కృష్ణంరాజు, డి.సునీల్ కుమార్ వంటి స్టార్ షట్లర్లను ఈ నేల అందించింది. ప్రస్తుతం కోర్టుకు న్యాయం చేసే న్యాయ నిర్ణేతలకు సైతం పుట్టినిల్లుగా మారింది. ఆశ్చర్యం ఏమిటంటే.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న ఐదుగురు టెక్నికల్ అఫీషియల్స్ పేర్లు శ్రీనివాసే కావడం విషయం. పాయసం, గొల్లకోటి, దొడ్డా, ఏవీ, అడపా.. వీరే కోనసీమ షటిల్ పంచ పాండవులు. టీచర్ ఉద్యోగం చేస్తూనే (ఒకరికి త్రుటిలో తప్పింది), షటిల్పై మక్కువతో 18 ఏళ్లుగా కోర్టులో సైడ్లైన్కు, సర్వీస్ ఫాల్ట్లకు కాపలా కాస్తున్న ఈ పంచ పాండవుల ప్రస్థానంపై కథనం.
అంతర్జాతీయ స్థాయికి
ఎదిగిన బ్యాడ్మింటర్ రిఫరీలు
ఐదుగురి పేరూ శ్రీనివాస్ కావడం
గమనార్హం
నలుగురు ఉపాధ్యాయులు,
ఒకటికి త్రుటిలో తప్పిన అవకాశం


