317జీఓ బాధితులకు న్యాయం చేయాలి | - | Sakshi
Sakshi News home page

317జీఓ బాధితులకు న్యాయం చేయాలి

Apr 19 2025 9:28 AM | Updated on Apr 19 2025 9:28 AM

317జీఓ బాధితులకు న్యాయం చేయాలి

317జీఓ బాధితులకు న్యాయం చేయాలి

భూపాలపల్లి అర్బన్‌: 317 జీఓ బాధితులకు వేసవి సెలవుల్లో బదిలీలు నిర్వహించి న్యాయం చేయాలని పీఆర్‌టీయూ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి పులి దేవేందర్‌ కోరారు. జిల్లాకేంద్రంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను చేయకుండా, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ఉపాధ్యాయ ఉద్యోగ హామీలను నెరవేర్చాలని కోరారు. ఆర్థిక నష్టం లేనటువంటి 317 జీఓ బాధితులకు న్యాయం చేసి వారి సొంత జిల్లాలకు బదిలీలు చేయాలన్నారు. లేనిపక్షంలో ఉద్యమాలు ప్రారంభిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు రాచర్ల శ్రీనివాస్‌, నాయకులు చంద్రయ్య, వెంకటేష్‌, రమేష్‌, పున్నంచందర్‌, సాగర్‌, తాడిచర్ల రవి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement