జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా రమేశ్‌బాబు | - | Sakshi
Sakshi News home page

జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా రమేశ్‌బాబు

Apr 16 2025 11:34 AM | Updated on Apr 16 2025 11:34 AM

జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా రమేశ్‌బాబు

జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా రమేశ్‌బాబు

వరంగల్‌ లీగల్‌/భూపాలపల్లి అర్బన్‌: ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని పలు జిల్లాల ప్రధాన న్యాయమూర్తులను బదిలీ చేశారు. ఈ మేరకు హైకోర్టు రిజిస్టార్‌ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. హనుమకొండ ప్రిన్సిపల్‌ అండ్‌ సెషన్స్‌ జడ్జి సీహెచ్‌.రమేశ్‌బాబు భూపాలపల్లి జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో రంగారెడ్డి జిల్లా మొదటి అదనపు జడ్జి డాక్టర్‌ కె.పట్టాభిరామారావు రానున్నారు. భూపాలపల్లి జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.నారాయణబాబు వరంగల్‌ జిల్లా కోఆపరేటివ్‌ ట్రిబ్యునల్‌ చైర్మన్‌గా బదిలీ అయ్యారు. మహబూబాబాద్‌ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ఎండీ అబ్దుల్‌ రఫీ, జనగామ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా కరీంనగర్‌ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.ప్రతిమను బదిలీ చేస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బదిలీ అయిన న్యాయమూర్తులు ఈనెల 23 వరకు నూతన స్థానంలో బాధ్యతలు స్వీకరించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

నారాయణబాబు బదిలీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement