జనగామ రూరల్: జిల్లాలో వ్యవసాయ రంగ అభివృద్ధికి, రైతులకు అవసరమైన ఆర్థిక సహకారం అందించేందుకు బ్యాంకులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా బ్యాంకర్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో బ్యాంకింగ్ రంగం ద్వారా అమలవుతున్న వివిధ కార్యక్రమాలు, రుణ లక్ష్యాలు, వ్యవసాయ రుణాల పంపిణీ, ప్రభుత్వ పథకాల పురోగతిపై సమీక్షించారు. వ్యవసాయ, పంట రుణాల పంపిణీలో జాప్యం ఉండొద్దని స్పష్టం చేశారు. ఈ సమన్వయ సమావేశంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ ప్రతిభ, డీఏఓ అంబికా సోనీ, డీఆర్డీఓ భాస్కర్, ఏపీడీ నూరుద్దీన్, ఏడీ ఎస్సీ కార్పొరేషన్ మాధవి లత, బ్యాంకు ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా


